Wednesday, June 2, 2010

పార్లమెంట్ - విరహ వేదన


 పి.వి. నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పటి రోజులు. ఉపాధ్యక్షరాలిగా శ్రీమతి నజ్మా హెప్తుల్లా వున్న రాజ్య సభలో ప్రశ్నోత్తరాల సమయం. ప్రధానికి ప్రశ్న వేశారు. కానీ ఆ సమయానికి ఆయన సభలో లేరు. ప్రతిపక్ష సభ్యులు తమ అభ్యంతరాన్ని ఉపాధ్యక్షురాలి దృష్టికి తీసుకెళ్ళారు. సరిగ్గా ఆ సమయంలోనే పి. వి. సభలో ప్రవేశించారు.


ఆయన్ని చూసి నజ్మా హెప్తుల్లా " ప్రధాని గారూ ! మీరంటే సభ్యులకు ఎంత ప్రేమో చెప్పలేం ! మీరు రావడం ఒక్క నిముషం ఆలస్యమైనా తాళలేకపొతున్నారు " అన్నారు.

వెంటనే పి.వి. నరసింహారావు గారు నవ్వుతూ " అయ్యో ! ఈ విషయం ముందే తెలిస్తే మరికొంచెం ఆలస్యంగా వచ్చేవాడిని.  అప్పుడు సభ్యులు విరహ వేదనతో మరింత ప్రేమ కురిపించేసి ఉండేవాళ్ళు కదా ? " అని ఛలోక్తి విసిరారు. 



Vol. No. 01 Pub. No.307

2 comments:

  1. MADHUKAR RAO REPALLEJune 2, 2010 at 10:36 PM

    SRRao Garu,

    This time you touched Sri P.V. Narasimha Rao a great personality of India.

    Every one has utilised him and thrown away. He lead the minority Govt. successfully for full time. Because of others, he has been eliminated.

    Really I hate politics.

    ReplyDelete
  2. మధుకరరావు గారూ !
    ధన్యవాదాలు. మీరు రాసినవి అన్నీ నిజాలే ! కానీ మనం సగటు మానవులం. భరిస్తూ, తిట్టుకుంటూ వుండడం తప్ప ఏమీ చెయ్యలేం.

    ReplyDelete