Wednesday, October 28, 2009
జగమే మాయ
1953 లో వచ్చిన దేవదాసు చిత్రానికి సంగీత దర్శకుడు సి. ఆర్. సుబ్బురామన్ అని సినిమా సంగీత ప్రియులందరూ టక్కున చెప్పేస్తారు. అయితే ఇప్పటికీ సజీవంగా నిలిచిపోయిన జగమే మాయ పాట స్వరకర్త మాత్రం సుబ్బురామన్ కాదంటే నమ్మరేమో ! కానీ ఇది నిజం.
ఆ చిత్ర నిర్మాణ సమయంలో సుబ్బురామన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దాంతో ఆయన ఈ పాటను స్వరపరిచే పరిస్థితి లేదు. ఆ సమయంలో ఆయనకు సహాయకుడిగా ఉన్న ఎం.ఎస్. విశ్వనాథన్ ఈ బాధ్యతను తీసుకున్నారు. తర్వాత రోజుల్లో దక్షిణాదిన అగ్రశ్రేణి సంగీత దర్శకుడిగా ఆయన ఎదగడం, ఎన్నెన్నో అపురూపమైన పాటల్ని అందించడం మనందరికీ తెలిసిన విషయమే !
Labels:
చలనచిత్ర
Subscribe to:
Post Comments (Atom)
ఔనండి
ReplyDeleteఇది విన్నాను. మంచి పాటం గుర్తు చేసారు.
శ్రీనిక గారూ !
ReplyDeleteధన్యవాదాలు