Tuesday, August 17, 2010
కవి ప్రభావం - పన్ను భారం
తల్లావఝుల శివశంకర శాస్త్రి గారు బహు భాషావేత్త, పండితులు. సాహితీసమితి ని స్థాపించి నవ్య సాహితీ సమితిగా దాన్ని మార్చి ఎందఱో కవులను, పండితులను ప్రోత్సహించారు.
శివశంకరశాస్త్రి గారికి పళ్ళు ఊడిపోయి బోసినోరు వచ్చేసింది. ఒకసారి ఆయన బోసినోటిని చూసి ఒక మిత్రుడు " మీరు పళ్ళు కట్టించుకుంటే బాగుంటుంది కదా ! " అని ఓ ఉచిత సలహా పడేసాడు.
దానికి శాస్త్రిగారు ఓ బోసి నవ్వు నవ్వి
" నాకు వాక్ - స్థానం కవి. ఆ కవిగాడి ప్రభావం వల్లనే నా నోట్లో ఒక్క పన్ను కూడా మిగలకుండా పోయింది. కవిగాడి ప్రభావానికి ఎదురు నిలవడం ఎవరితరం. అయినా భారాలు ఎక్కువైపోతున్న రోజుల్లో పన్నుల భారం తగ్గినందుకు సంతోషించాలి కదా ! " అన్నారట.
శ్లేషలంటే పండితులకు నల్లేరు మీద బండి నడక లాంటివి కదా !
Vol. No. 02 Pub. No. 006
Labels:
ఛలోక్తులు
Subscribe to:
Post Comments (Atom)
chala baga answer icharu kadaa
ReplyDeleteహను గారూ !
ReplyDeleteధన్యవాదాలు