స్వాతంత్ర్యయోద్యమ సమయంలో జవహర్లాల్ నెహ్రు చాలాసార్లు జైలుకెళ్ళడం జరిగింది. ఒకసారి ఆయన వున్న ఒక జైల్లో ఆహారం చాలా ఘోరంగా ఉండేది. అన్నం నిండా రాళ్ళే ! ఆది భరించలేక నెహ్రుగారు జైలర్ కి ఫిర్యాదు చేశారు.
దానికా ఆంగ్ల జైలర్ " మీ దేశానికి స్వాతంత్ర్యం కావాలని జైలుకి వచ్చారు. మీరు మీ దేశాన్ని నిజంగా ప్రేమిస్తూ వుంటే తిండి విషయంలో పట్టింపు వుండకూడదు " అన్నాడు వెటకారంగా.
దానికి నెహ్రు బదులిస్తూ " అవును. నేను నిజంగానే నా మాతృభూమిని ప్రేమిస్తున్నాను కాబట్టే ఈ భూమినుంచి తయారైన అన్నం తినాలనుకుంటున్నాను గానీ రాళ్ళనూ, మట్టినీ తినేయ్యాలనుకోవడం లేదు " అన్నారట.
పండిట్ జవహర్లాల్ నెహ్రు వర్థంతి సందర్భంగా నివాళులర్పిస్తూ..........
Vol. No. 01 Pub. No.300
హారం ప్రచారకులకు
ReplyDeleteచాలా సంతోషం. అభినందనలు.