బొమ్మను చేసి ప్రాణము పోసి
ఆడేవు నీకిది వేడుక
గారడీ చేసి గుండెను కోసి
నవ్వేవు ఈ వింత చాలిక !!
హాస్య నటుడు పద్మనాభం నిర్మించిన " దేవత " లోని పాట ఇది. దీనిలో ' బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక ....' అనే పల్లవి వేటూరిది. అతని అనుమతి మీద, పద్మనాభం కోరిక మీద ప్రారంభంలోని సాకీతో సహా దీన్ని పూర్తి చేసాను.
.................. అంటారు మహాకవి శ్రీశ్రీ తన ' పాడవోయి భారతీయుడా ' సంకలనంలో. దీన్ని బట్టి వేటూరి వారి సినిమా రంగ ప్రవేశానికి ప్రయత్నాలు చాలా ముందే జరిగాయని అనుకోవచ్చు. అలాగే అప్పట్లో ఆయన ప్రవేశానికి వ్యాపార సూత్రాలు అడ్డుపడి వుండొచ్చు కూడా.
Vol. No. 01 Pub. No. 297
ఆ పల్లవి వీటూరి దండీ. ఆయన కూడా పాటల రచయితే. ‘వయసు పిలిచింది’ అనే సినిమాలో ‘ఇలాగే... ఇలాగే సరాగమాడితే..’ పాట వీటూరి రాసిందే. వేటూరి, వీటూరి పేర్లలో అక్షర సామ్యం ... ఇద్దరూ ఒకరే అనుకునే ప్రమాదం కలిగిస్తోంది.
ReplyDeleteవేణు గారూ !
ReplyDeleteఈ విషయంలో నాక్కూడా సందేహం లేకపొలేదు. కానీ శ్రీశ్రీ గారు తన ' పాడవోయి భారతీయుడా ' పుస్తకంలో స్పష్టంగా వేటూరి అనే రాసారు. ఆ పుస్తకంలోని విషయాన్నే నేను ఇవ్వడం జరిగింది. ఆ పుస్తకాన్ని శ్రీశ్రీ గారు స్వయంగా ప్రూఫ్ దిద్దారని అంటారు. అయినా అచ్చు తప్పు దొర్లిందంటారా ? మరి ఈ విషయంలో ఏది నిజమో !