Wednesday, January 27, 2010

మరో విషాద వార్త

ఈ రోజు ఉదయాన్నే తెలుగు చలనచిత్ర రంగంలో తండ్రిగా పేరు పొందిన గుమ్మడి గారి
మరణవార్త విని తేరుకోక ముందే మరో విషాద వార్త వినవలసి వచ్చింది.

మన బ్లాగ్లోకంలో సీనియర్ బ్లాగర్ 'కొత్తపాళీ' గా సుపరిచితులైన నారాయణస్వామి గారికి
మామగారైన శ్రీ M.V. సుబ్బారావు గారు
స్వర్గస్తులైనారని తెలియజేయడానికి విచారిస్తున్నాను.

నారాయణస్వామి గారికి , ఆయన శ్రీమతి సావిత్రి గారికి , వారి కుటుంబ సభ్యులకు
' శిరాకదంబం ' తరఫున నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

Vol. No. 01 Pub. No. 171

7 comments:

  1. అయ్యో..కొత్తపాళీ గారికి సావిత్రి గారికి నా ప్రగాఢ సానుభూతి

    ReplyDelete
  2. కీ.శే. సుబ్బారావు గారితో నాకు పరిచయం లేదు. వారి కుమార్తె శ్రీమతి మాచిరాజు సావిత్రి DTLC దశమ వార్షికోత్సవ సమావేశం, డిట్రాయిట్ లో పరిచయమయ్యారు. సావిత్రి గారికి నా సంతాపం తెలియపరుస్తున్నాను.

    ReplyDelete
  3. * సిరిసిరిమువ్వ గారూ !
    * గీతాచార్య గారూ !
    * రావు గారూ !

    మీ స్పందన కొత్తపాళీ గారికి తెలియజేస్తాను.

    ReplyDelete
  4. మీ ఆత్మీయతకి ధన్యులం రావుగారు.

    సీబీరావుగారికి .. మాచిరాజు సావిత్రిగారు వేరే. ఆవిడ కేలిఫోర్నియాలో ఉంటారు.

    ReplyDelete
  5. very sorry. పుస్తకావిష్కరణ రోజు వారిని చూడటం జరిగింది వారి కుటుంబం త్వరగా ఆ వియోగం నుండి తేరుకోవాలని కోరుకుంటూ ...

    ReplyDelete
  6. అయ్యో..కొత్తపాళీ గారికి సావిత్రి గారికి నా నా సంతాపం తెలియపరుస్తున్నాను.

    ReplyDelete