వలపు లొలుకుపువ్వుల్లారా !
తెలుగుతల్లివదనమ్మున
విరిసినచిరునవ్వుల్లారా !
నవతావాదుల్లారా !
మానవతావాదుల్లారా !
నవచైతన్యం ఉరకలు వేసే
యువతీయువకుల్లారా !
భారతయువతీయువకుల్లారా !
నవభారతనిర్మాతల్లారా ! "
......................................
మా గురువు గారు, కవి డాక్టర్ వక్కలంక లక్ష్మీపతిరావు గారు రచించిన దేశభక్తి గేయం అది. ఆయన అనేక లలితగీతాలు, దేశభక్తి గీతాలు రచించారు. అవి 1970-90 ప్రాంతాలలో విరివిగా ఆకాశవాణి కేంద్రాలలో వినపిస్తూ ఉండేవి. ఇప్పటికీ అప్పుడప్పుడు ఆకాశవాణి కేంద్రాలనుంచి పున: ప్రసారం అవుతూ ఉంటాయి. అప్పట్లో ఆకాశవాణి గుర్తింపు ఉన్న రచయిత. ఇవే కాక ఇంకా అనేక గ్రంథాలు రాసారు. ప్రస్తుతం వృద్ధాప్యం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నారు.
గణతంత్ర దినోత్సవం షష్టి పూర్తి చేసుకుంటోంది. ఆ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పూర్తి గేయాన్ని ఇక్కడ చూడండి .............
Vol. No. 01 Pub. No. 168
మంచి విషయం చెప్పారు. మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
ReplyDeleteజయ గారూ !
ReplyDeleteధన్యవాదాలు
అవునండి. శ్రీ వక్కలంక లక్ష్మీపతిరావుగారు ఈ మధ్యే పరమపదించారు. రోజులు జరుగుతున్నాయి ఇంకా.
ReplyDelete* కిషోర్ గారూ !
ReplyDeleteగురువు గార్ని ఎలా మరచిపోగలను. ధన్యవాదాలు
* అజ్ఞాత గారూ !
ధన్యవాదాలు