గిడుగు రామమూర్తి పంతులు గారి వ్యావహారిక భాషోద్యమాన్ని గురించి తెలియనివారుండరు.
అలాగే జయంతి రామయ్య పంతులు గారు కరుడుగట్టిన గ్రాంథిక భాషా వాది. కనుక ఇద్దరికీ భాషా పరంగా బేదాభిప్రాయాలుండడం సహజమే కదా !
అవకాశం దొరికితే తరచూ పరస్పరం విసుర్లు వేసుకుంటూ ఉండేవారు.
అలాంటి అవకాశం ఒకసారి గిడుగువారికి దొరికింది.
ఎక్కడో ఏదో సందర్భంలో జయంతి వారు పొరబాటున " తలకు నూనె వ్రాసుకుని...... " అని రాసారుట !
అంతే ! గిడుగు రామమూర్తి గారు అది పట్టుకున్నారు.
" అవునవును. రామయ్య పంతులు గారు తలకు నూనె వ్రాస్తారు. పుస్తకాలేమో...... రాస్తారు " అని చురకేసారు.
Vol. No. 01 Pub. No. 136
No comments:
Post a Comment