Saturday, December 5, 2009

మహానటీ ! నీవు లేక...!!


నీవు లేక వీణా పలుకలేనన్నది !
నీవు లేక వెండి తెర వెల వెల పోయినది !!

కనులు కనులతో కలబడితే
కనులే మనతో మాటలాడితే

జీవితంలోనటించడం చాలామందికి తెలుసు
నటనలో జీవించడం కొందరికే తెలుసు

వారిలో అగ్ర తాంబూలం మహానటి సావిత్రిదే !



గుంటూరు జిల్లా తెనాలి దగ్గర చిర్రావూరు గ్రామంలో 1936 డిసెంబర్ 6 వ తేదీన ఉదయించిన ఈ తార 13 ఏళ్ళ వయసులో 1949 లో ' అగ్ని పరీక్ష ' చిత్రంలో చిన్న పాత్రతో తెలుగు చలన చిత్ర సీమలో తళుక్కున మెరిసింది.
1950 లో ' సంసారం ' చిత్రంలో రెండవ హీరోయిన్ కాబోయి మళ్ళీ చిన్న పాత్రతో సరిపెట్టుకుంది.
1951 లో ' పాతాళ భైరవి ' లో నృత్యం చేసింది.



1952 లో ' పెళ్లి చేసి చూడు ' చిత్రంలో రెండవ హీరోయిన్ పాత్ర దక్కింది.
1953 లో ' దేవదాసు ' చిత్రంతో ఆమె నటజీవితం మలుపు తిరిగింది.



1954 లో ' మనంబోల మాంగల్యం ' అనే తమిళ చిత్రంలో నటిస్తున్న సమయంలో జెమిని గణేషన్ ను వివాహమాడారు.
1958 లో విజయ చాముండేశ్వరి, 1965 లో సతీష్ ఆమె సంతానంగా జన్మించారు.
1960 లో ' చివరకు మిగిలేది ' చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు.
తెలుగులో చిన్నారి పాపలు, మాతృదేవత, వింత సంసారం మొదలైన చిత్రాలకు
తమిళంలో ఉళ్ళం, ప్రాప్తం చిత్రాలకు సావిత్రి దర్శకత్వం వహించారు.
నిర్మాతగా వ్యవహరించిన ' ప్రాప్తం ' చిత్ర సీమలో మకుటం లేని మహారాణిగా వెలిగిన ఆ మహానటి పతనానికి పునాది వేసింది.



మహానటి సావిత్రి పుట్టిన రోజు సందర్భంగా సృత్యంజలి

Vol. No. 01 Pub. No. 127

2 comments:

  1. ఆ మహానటి ని ఎవ్వరూ...ఎప్పటికీ మర్చిపోలేరు. చాలా మంచి ప్రయత్నం చేసారు. ఇన్ని వివరాలు తెలియచేసిన మీకు నా కృతజ్ఞతలు. ఆ మహా నటికి ఈ లోకంలో లేకపోయినప్పటికీ నా జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తున్నాను.

    ReplyDelete
  2. జయ గారూ !
    మనకి ఎన్నో ఆణిముత్యాలున్నాయి. వారిని ఇలాంటి సందర్భాలలోనైనా ఒక్కసారి స్మరించుకుంటే వారిలోని మంచి లక్షణాలు కొన్నైనా మనకి స్పూర్తిని కలిగిస్తాయేమోనని ఒక చిన్న ఆశ. మీ స్పందనకు ధన్యవాదాలు.

    ReplyDelete