ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి గారు పనిచేస్తున్న రోజుల్లో ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి భాట్టం శ్రీరామమూర్తి గారు విధాన సభలో సోషలిస్ట్ పార్టీ సభ్యులుగా వుండేవారు.
ఒకసారి శ్రీరామమూర్తి గారు అధికార పక్షాన్ని విమర్శిస్తుంటే సంజీవరెడ్డి గారు సభను ఉద్ద్యేశించి మాట్లాడుతూ....
" అధికార పక్షాన్ని దుయ్యబట్టే హక్కు ఒక్క ప్రతిపక్ష సభ్యులదే కాదు. అధికారపక్ష సభ్యులకు కూడా ఉంటుంది. మా పార్టీ సభ్యులై నన్నోకసారి రావణాసురుడు అన్నారు " అంటూ చెబుతుంటే ..........
వెంటనే భాట్టం శ్రీరామమూర్తి గారు అడ్డుకుని ......
" అయ్యా ! నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని రావణాసురుడితో పోల్చలేదు. అలా పోల్చలేను కూడా ! ఎందుకంటే రావణాసురుడు గొప్ప తపస్సంపన్నుడు కదా ! " అన్నారు. సభంతా గొల్లుమంది.
Vol. No. 02 Pub. No. 026
good one
ReplyDeletemanchi post. ilantivatiki maa spandana eppudu baguntundi.......
ReplyDelete* ఉదయ రాఘవ గారూ !
ReplyDelete* శరత్ !
ధన్యవాదాలు