ఓసారి రవీంద్రభారతిలో పండితసభ జరుగుతోంది. అందులో గిడుగు సీతాపతి గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, వేదుల సత్యనారాయణ గారు లాంటి పెద్దలంతా పాల్గొన్నారు. భాషావాదం పైన వాడిగా, వేడిగా చర్చ జరుగుతోంది.
' ఏ వస్తువైనా సరే ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా ధనవంతులకు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలకు అందుబాటులో ధరలో ఉంటేనే బాగుంటుంది. అలాగే విద్వాంసులకోసం పండిత భాష అనేది వున్నా కూడా సామాన్యులకు కోసం సరళమైన భాష ఉండాలి. అప్పుడే భాషలోని పరిమళం అందరికీ అందుతుంది. '
....... అని పెద్దలందరూ సుదీర్ఘ చర్చ తర్వాత తీర్మానించారు. ఈ చర్చ మొత్తాన్ని ఆ వేదిక మీదే కూర్చున్న దేవులపల్లి వారు మౌనంగా గమనిస్తున్నారు. వేదుల వారికి అనుమానం వచ్చింది. భాషావాదం పైన ఇంత ఘాటుగా చర్చ జరుగుతుంటే అందులో పాల్గోవటం మానేసి కృష్ణశాస్త్రి గారు ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారేమిటా అని. అదే విషయం ఆయన్ని అడిగారు.
" వారంతా దిగ్దంతులు. వారితో మనమేం మాట్లాడగలం చెప్పండి " అని చమత్కరించారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.
...... ఆ సభలో పాల్గొన్న పెద్దల్లో చాలామంది ఢెబ్భైవ పడిలో పడ్డవారే !
Vol. No. 02 Pub. No. 036
దిగ్దంతులు - దిగంబరుళ్ళాగా అన్నమాట. గొప్ప చమత్కారం
ReplyDeleteదిగ్దంతులు...what does it mean?
ReplyDelete