Showing posts with label సాహిత్య విశేషాలు. Show all posts
Showing posts with label సాహిత్య విశేషాలు. Show all posts

Thursday, November 11, 2010

జారిపోయిన జంట కవిత్వం

తెలుగు సాహితీ సంపద పెరుగుదలకు ఎందఱో సాహితీవేత్తలు, కవులు తమ వంతు కృషి చేశారు. వారిలో కొంతమంది జంట కవులు కూడా వున్నారు. వారిలో కొప్పరపు కవులు, తిరుపతివెంకట కవులు.... ఇలా ఎన్నో జంటలు విడివిడిగానే కాక జంటకవులుగా ప్రసిద్ధులు.


ఒకసారి ప్రముఖ కవులు దీపాల పిచ్చయ్యశాస్త్రి గారు, గుర్రం జాషువా గారు కలసి జంటగా కవిత్వం చెప్పాలని సంకల్పించారు. ఇతర జంట కవుల్లాగే తమ పేర్లు కలసివచ్చేలాగా తమ జంటకు ఒక పేరు పెట్టుకోవాలని ఆలోచించారు. ఎంత ఆలోచించినా వీరికి తమ పేర్లలోనుంచి సరిపోయే పేరు దొరకలేదు. ఏ రకంగా చూసినా పిచ్చి జాషువా అనో , జాషువా పిచ్చి అనో, దీపాల గుర్రం అనో ...... ఇలా ఏదో పెట్టుకోవాల్సి వస్తోంది. ఎంత కసరత్తు చేసినా తమ పేర్లతో కుదిరే కుదురైన అందమైన పేరు దోరక్క చివరికి జంటగా కవిత్వాన్ని చెప్పే ఆలోచనే విరమించుకున్నారట. దాంతో మరో కవుల జంట తెలుగు సాహిత్యం చేజారిపోయింది.  


Vol. No. 02 Pub. No. 054

Monday, June 7, 2010

యుగంధరుని బారసాల - B & G లో ....

ప్రముఖ డిటెక్టివ్ నవలా రచయిత కొమ్మూరి సాంబశివరావు గారి యుగంధరుడి బారసాల వృత్తాంతం B & G  లో చదవండి....ఈ క్రింది లింక్ లో ......
 http://booksandgalfriends.blogspot.com/2010/06/blog-post_08.html








 Vol. No. 01 Pub. No.313

Monday, May 24, 2010

శ్రోతల్లో రకాలు - వక్తలు

1950 వ సంవత్సరంలో  దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రేడియోలో   ' వక్తృత్వము- శ్రోతల మనస్తత్వము ' అనే విషయం మీద చేసిన  ప్రసంగంలో శ్రోతల్లో రకాల గురించి, వారి మనస్తత్వాల గురించి, వారి మధ్యన ప్రసంగం చేసే వక్తల ఇబ్బందుల గురించి హాస్య, వ్యంగ్య ధోరణిలో వివరించారు. ఆ ప్రసంగపాఠం నుండి కొన్ని భాగాలు.......

ఈ వ్యాసం ఈ రోజు B & G లో  ప్రచురితమైంది. ఆ లింక్ ఇక్కడ .................

http://booksandgalfriends.blogspot.com/2010/05/blog-post_24.html


 Vol. No. 01 Pub. No. 296

Sunday, May 9, 2010

అచ్చు తప్పుకు ఆఠాణా

తెలుగు ప్రచురణ రంగానికి ఆద్యులు, తెలుగు భాషా వికాసానికి కృషి చేసిన మహానుభావుడు స్వర్గీయ వావిళ్ళ రామస్వామిశాస్త్రి గారు. అనేక ప్రాచీన గ్రంథాలను పరిష్కరించి, వాటిని ప్రచురించిన ఘనత ఆయనకే దక్కింది.  తెలుగులో వున్న వ్రాత ప్రతులను  ముద్రణా పద్ధతిని వుపయోగించి తమ ' ఆది సరస్వతీ ముద్రణాలయము ' ద్వారా ప్రచురించింది వావిళ్ళ వారే ! సి. పి. బ్రౌన్ పరిష్కరింపజేసిన ఎన్నో గ్రంథాలను ప్రచురించి వెలుగులోకి తీసుకొచ్చారు.

సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని రోజుల్లో ముద్రణా పద్ధతుల్లో కొత్త పుంతలు తొక్కి నాణ్యమైన గ్రంథాలను తెలుగువారికి అందించారు. వారి గ్రంథాలలో మచ్చుకైనా ఒక్క తప్పు కూడా కనబడేది కాదట. ముద్రణకు పూర్వమే అచ్చుతప్పులను సవరించడానికి ఉద్ధండులైన పండితుల్ని నియమించేవారు. వీరి లోపాలులేని ముద్రణ పైన ఆసక్తికరమైన కథనాలెన్నో ఉండేవి.  వాటిలో మచ్చుకి  ఒకటి.........

రామస్వామిశాస్త్రి గారు తన ముద్రణాలయం బయిట ముద్రణకు సిద్ధం చేసే ఫారాన్ని ప్రదర్శనకు పెట్టి
' మేము ప్రచురించిన గ్రంథములో అచ్చుతప్పులేరి చూపించిన వారికి ఒక దోషమునకు ఎనిమిది అణాలు చొప్పున  ఇస్తాం ! '
అని ప్రకటించేవారట.  తాను ప్రచురించిన గ్రంథాలపై ఆయనకు వున్న నమ్మకం అలాంటిది.

" వావిళ్ళవారి కృషి లేకున్న పక్షమున, వైదిక పురాణాది గ్రంథములు విస్మృతిలో నశించియుండును. కాలవాహినిలో అందరునూ కలిసిపోయి విస్మరింపబడినప్పటికీని, శ్రీ వావిళ్ళ వారి కృషి అమర ప్రాయము పొంది నిలువగలదు "
అని ప్రశంసించారు డా. కట్టమంచి రామలింగారెడ్డి గారు.

పిఠాపురం మహారాజావారు వావిళ్ళవారి గురించి
" సారస్వతవ సేవయే వారి ఆశయము. ఆంధ్రులకు జ్ఞాన దానము చేసినారు. ఆంధ్ర, తమిళ, కర్నాటక, సంస్కృత భాషలందు గ్రంథములు ప్రచురించి భాషా సేవా గావించుచూ ధన్యులై, విద్యావంతులై గుణగ్రహణ ప్రావీణులై యుండిరి "
అని ప్రస్తుతించారు.

తెలుగు గ్రంథ ప్రచురణకు మార్గదర్శకులైన స్వర్గీయ వావిళ్ళ రామస్వామిశాస్త్రి గారు 1891 వ సంవత్సరము మే నెలలో (  తేదీ లభ్యం కాలేదు ) దివంగతులైనారు. తెలుగు ప్రచురణకర్తలు వావిళ్ళవారిని స్మరించుకోవడం తమను తాము గౌరవించుకోవడమే ! వావిళ్ళ రామస్వామిశాస్త్రి గారికి సాహితీ నీరాజనాలు అర్పిస్తూ..........

వావిళ్ళ వారిపై గత టపాలు - పుస్తకానికి గజకేసరి యోగం , తెలుగు ముద్రణారంగ పితామహులు 

Vol. No. 01 Pub. No. 288

Thursday, April 29, 2010

కల కానిది... విలువైనది

 కల కానిది... విలువైనది బ్రతుకు 
కన్నీటి ధారలలోనే బలి చేయకు 

అంటూ జీవిత సత్యాన్ని ఆవిష్కరించిన మహాకవి

గాలి వీచి పూవులా తీగ నేల రాలిపోగా 
జాలివీడి అటులేదాని వదలివైతువా 
చేరదీసి నీరుపోసి చిగురించనీయవా !!

అంటాడు. మానవనైజంలో చెడుతో బాటు మంచి కూడా అంతే పాళ్ళలో వుంటుంది. ఆ మంచితనాన్ని గుర్తు చేస్తారు శ్రీశ్రీ.

అలముకున్న చీకటిలోనే అలమటించనేలా
కలతలకే లొంగిపోయి కలవరించనేలా
సాహసమను జ్యోతిని చేకొని సాగిపో !!

అని నిరాశలో మునిగిపోయిన వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తాడు మహాకవి .

అగాధమౌ జలనిధిలోన ఆణిముత్య మున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే 
ఏదీ తనంతతానై నీ దరికిరాదు
శోధించి సాధించాలి, అదియే ధీర గుణం !!

అంటూ ధైర్యం చెబుతూ కర్తవ్య బోధ చేస్తారు శ్రీశ్రీ.

అతి తేలికైన పదాల్లో, సరళమైన భాషలో అంతులేని జీవిత సత్యాలను ప్రబోధిస్తారు శ్రీశ్రీ.
సాహిత్యానికి కావలసింది పదాడంబరం కాదు భావ ప్రకటన అని ప్రకటించారు శ్రీశ్రీ.
సినిమా సాహిత్య ప్రక్రియ మరే ఇతర ప్రక్రియకు తీసిపోనిదని ఋజువు చేశారు శ్రీశ్రీ.
మహాప్రస్థానంలాంటి రచనలతో మహోన్నతాలకెదిగిన ఆయన
సినిమా సాహిత్యాన్ని కూడా ఆ స్థాయికి తీసుకెళ్ళచ్చని  నిరూపించారు
ఏం రాసినా, ఏది రాసినా ఆయనకే చెల్లు
ఎవరెన్ని అన్నా, ఎవరేం అనుకున్నా
ఆయన పథం ఆయనది.. ఆయన విధానం ఆయనది
అందుకే ఆయన మహాకవి  అయ్యారు, ప్రజల కవి అయ్యారు.

కల కానిది.... పాట పూర్వాపరాల గురించి ' పాడవోయి భారతీయుడా ' సంకలనంలోని శ్రీశ్రీ గారి మాటల్లో...............
**************************************************************************
అన్నపూర్ణా పిక్చర్స్ వారి ' వెలుగు నీడలు ' లోని ఈ పాటకు ట్యూన్ వెదకడానికి సంగీత దర్శకుడు పెండ్యాల 15 రోజులు కృషి చేశారు. ట్యూన్ ఓకే అయిన తరువాత తెలుగు పాట నేను, తమిళ పాట నారాయణ కవి రాశాము. సాధారణంగా అన్నపూర్ణా సంస్థలో ముందుగా ట్యూన్ నిర్ణయించడం జరుగుతుంది. సంగీతం విషయంలో మధుసూదనరావు గారికి మంచి అభిరుచి వుంది. హిందీలో రాజ్ కపూర్ కి ఉన్నట్లు. అందుకే వీరుద్దరి చిత్రాలలోని పాటలు నాలుగు కాలాలపాటు నిలిచేవిగా వుంటాయి.
ఎంతవరకూ నిజమో నాకు తెలియదుగానీ ఆత్మహత్య చేసుకోబోయిన ఒక వ్యక్తి ' కలకానిది, విలువైనది ' అన్న పాటను విని ఆ ప్రయత్నం విరమించుకున్న ఉదంతం ఎవరో చెప్పగా విన్నాను. 
 ******************************* ******************************************

' అగాధమౌ జలనిధిలోన ఆణిముత్య మున్నటులే ' అన్న వాక్యం నారాయణకవిదని శ్రీశ్రీ గారు చెప్పినట్లుగా నేనెక్కడో చదివినట్లు బాగా గుర్తు. తనది కాని విషయాన్ని నిజాయితీగా అంగీకరించే సంస్కారం మహాకవి శ్రీశ్రీది. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా ఆయన ప్రభావం తెలుగు కవిత్వం మీద ఇప్పటికీ వుంది. ఎప్పటికీ వుంటుంది.

మహాకవి శ్రీశ్రీ శతజయంతి వేడుకలు నేటితో ( ఏప్రిల్ 30 )  ముగుస్తున్నాయి. ఆయన్ని స్మరించుకోవడమంటే తెలుగు కవిత్వాన్ని, సినీ కవిత్వాన్ని మరోసారి సమీక్షించుకోవడమే ! ఆ మహాకవికి కవితాంజలులు.




సామ్యవాద కవితా దర్సనం-మహాప్రస్థానం
శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం మొదలైన గీతాలు
శ్రీశ్రీ కవితాప్రస్థానం

Vol. No. 01 Pub. No. 277

మహాకవికి తీరని కోరికలు

 మనిషి ఎంతటివాడైనా కోరికలకు అతీతుడు కాదు. కొన్ని కోరికలు సునాయాసంగా తీరుతాయి. మరికొన్ని కొంచెం కష్టపడితే తీరతాయి. అయితే కొన్ని మాత్రం తీరని కోరికలగానే మిగిలిపోతాయి.

మహాకవి శ్రీశ్రీ గారికి కూడా కొన్ని కోరికలుండేవి. అయితే అవి తీరని కోరికలే ! ఎందుకంటే అవి తీరకుండానే ఆయన మరణించారు. వాటిలో ముఖ్యమైన కొన్ని ...........

* ఆయనకు రెండు కథల మీద మోజుగా వుండేది. అవి ఒకటి రుక్మిణీ కళ్యాణం కథ. మరోటి కవి తిక్కన - ఖడ్గతిక్కన, ఈ ఇద్దరి జీవితాలలోని విశేషాలను మిళితం చేసి ఒకే కథగా రూపొందించాలని ఆయన కోరిక.  అంతే కాదు. ఈ రుక్మిణీ కళ్యాణం కథనీ, కవి - ఖడ్గ తిక్కన కథనీ చలన చిత్రాలుగా తీయాలని కోరికగా వుండేది.


* " నెరవేరితే నిలువుటద్దం సైజులో ' మహాప్రస్థానం ' ను ఆచ్చువేయించాలని ఉంది. ఇవి గొంతెమ్మ కోరికలే ! నా జన్మలో నేరవేరుతాయా ? " అనేవారట ఆ మహాకవి.

చివరకి ఈ రెండు కోరికలూ నెరవేరలేదు. ఆ మహాకవి శత జయంతి సందర్భంగా ఎవరైనా పూనుకుని కనీసం ఆయన రెండో కోరికైన ' మహాప్రస్థానం ' నిలువుటద్దం సైజులో అచ్చు వేయిస్తే ఆయన కోరిక నేరవేర్చినట్లుంటుంది. ఎవరైనా ఆలోచిస్తే బాగుండును.

మహాప్రస్థానం 
మహాప్రస్థానం: మహాకావ్యం
శ్రీ శ్రీ మహాప్రస్థానం: సమాలోచనం 

ఆ మహాకవికి ఇష్టమైన పాటలుగా పేర్కొన్న వాటిలో ఒకటి ' తోడికోడళ్ళు ' చిత్రంలో ' నలుగురు కలసి, పొరువులు మరచి, చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం  ' ........ మీకోసం........
  



Vol. No. 01 Pub. No. 276

Wednesday, April 28, 2010

బిందు పూర్వక హకార ప్రాస

మహాకవి శ్రీశ్రీ గారు ఆధునిక కవిత్వానికి ప్రతీక అయినా ప్రాచీన కవిత్వ ప్రభావం ఆయనపై ఎంత వుందో తెలుసుకోవడానికి ఈ సంఘటనే ఉదాహరణ.
     **************************************** 
అంహో దుర్భరమాయె భారతము ! గ
                గర్వాంధుల్, దురార్భాట సం 
 రంహుల్,  స్వార్తపరుల్ చరింతురిట ! నీ
                రల్ సేయు ఘోరాలప
సింహంబోయిన లేచి, నేనిక మహా 
               క్ష్వేళాధ్వనిన్ వీరలన్
సంహారం బొనరించు శక్తిని జగ 
              న్మాతా ! ప్రసాదింపుమా ! 


*  *  *

సినిమాకు పద్యం రాయడం అంటే నాకు చాలా ఇష్టం. నవతా ప్రొడ్యూసర్ కృష్ణంరాజు గారు తమ " పంతులమ్మ " చిత్రంలోని శివాజీ నాటకానికొక పద్యం కావాలంటే ఇది రాశాను. రాసిన తర్వాత ఎవరో - కృష్ణంరాజుగారే కాబోలును - ఇందులోని తుది పాదంలో యతి భంగమయిందన్నారు. ( ' సం ' తో ' న్మా ' యతి కుదరదనుకొని ) దానికి ముందు పాదంలోని ' వీరలన్ ' లో ఉన్న నకారపు పొల్లుతో ' న్మా ' కి యతి కుదిరిందన్నారు. ఇటువంటి చందో రహస్యాలు చాలామందికి తెలియవు. దీర్ఘాక్షరంతో ప్రారంభమైన కంద పద్యంలో నాలుగింట జగణం వెయ్యకూడదని కొందరికి తెలియదు.  
బిందు పూర్వక హకార ప్రాస నిర్వహించడం కష్టం. విశ్వనాథ సత్యనారాయణగారు తమ విశ్వేశ్వర శతకంలో  ' అ(హోవారణ కుంభ పాటనకళోధచ్చ్వేత భూ భ్రుద్ధరీ సింహస్వామి ' అని ప్రారంభించి నాలుగో పాదంలో ' నచాహం హంతవ్య ' అని ప్రాస చేశారు. సంస్కృతంలో వారు ప్రాస వాడితే నేనెందుకు ఇంగ్లీషులో వాడకూడదని..

సింహాలకు Zoo లుండును 
సంహారమే సృష్టియగును సామాన్యంగా 
అంహస్సెయగును పుణ్యము 
Somehow మన కవనధారా స్రవియించు ...

అని రాశాను. 

*******************************************

............... అంటారు మహాకవి శ్రీశ్రీ తన పాటల సంకలనం ' పాడవోయి భారతీయుడా ' లో .......

శ్రీశ్రీ గారి చెప్పుకోదగ్గ పాటల్లో ఒకటి నటుడు పద్మనాభం నిర్మించిన ' దేవత ' చిత్రంలోని ' బొమ్మను చేసి ప్రాణం పోసి...' పాట గురించి......

" బొమ్మను చేసి ప్రాణము పోసి 
ఆడేవు నీకిది వేడుక..........."  అనే పల్లవి వేటూరిది. అతని అనుమతి మీద, పద్మనాభం కోరిక మీద ప్రారంభంలోని సాకీతో సహా దీన్ని పూర్తి చేసాను. కీర్తిశేషుడు కోదండపాణి తయారు చేసిన బాణీ రచయితను తికమాట పెట్టేదిగా ఉంది. కష్టపడి నేను రాసిన పాటలలో ఒకటిగా దీనిని చెప్పుకోవాలి.

........... అంటారు శ్రీశ్రీ తన ' పాడవోయి భారతీయుడా ' సంకలనం లో .




Vol. No. 01 Pub. No. 273

Tuesday, April 27, 2010

సినిమాల్లో పాటల గురించి శ్రీశ్రీ

బొమ్మలు మాట్లాడటం ప్రారంభించాక హాలీవుడ్లో  తయారైన మొట్టమొదటి టాకీ చిత్రం సంగీత ప్రధానమైనది. అప్పుడే సాహిత్యంతో కూడిన పాటలు స్వరబద్ధమైన సంగీతంతో బాటు సినిమా రంగ ప్రవేశం చేశాయి. అలాగే ఇండియాలో తయారైన మొదటి హిందీ చిత్రం ' ఆలం ఆరా ' గానరస ప్రధానమైనదే. దీన్ని మద్రాసులో ప్రదర్శించినప్పుడు నేనూ చూసాను. ఏం చూసాను, ఏం విన్నానో ఇప్పుడు జ్ఞాపకం లేదు గానీ బ్లాకులో టికెట్లు కొనలేదని మాత్రం జ్ఞాపకంగా చెప్పగలను. అప్పటికింకా మనదేశం అంత అభివృద్ధి సాధించలేదు. కనీసం అప్పటికింకా మనకి స్వరాజ్యమైనా రాలేదు.

నేను మొదటే చెప్పాను. సినిమాకి పాటల అవసరాన్ని సందేహిస్తున్నానని. ( ఆ అవసరం లేకపోతే నేను నిరుద్యోగినై పోతానేమో అన్నది వేరే సంగతి ! ) ఒక్క పాటలే అన్న మాటేమిటి ? సినిమాకు అక్కరలేనిదంటూ ఏమైనా వుందా అనేది నా ధర్మ సందేహం. ఈ రెండో దానికి నా మొదటి సందేహం తీరిపోయింది. అవును మన సినిమాల్లో పాటలుండాలి. తెలుగు పుస్తకాల్లో అచ్చుతప్పుల్లా.

నా మొదటి పాట ' కాలచక్రం ' అనే చిత్రంలో మొదటి నిమిషాలలోనే వచ్చింది. అదే నా ' మహాప్రస్థానం ' పాట. అప్పటికే కొంత చప్పుడు చేసిన ఆ పాటను వాళ్ళు కావాలన్నారు. నేను సరేనన్నాను. దానికిగాను నాకు ముట్టిన పారితోషికం సినిమా హాల్లోకి ఉచిత ప్రవేశం. బందా కనకలింగేశ్వరరావు, ముంజులూరి కృష్ణారావు, కపిల కాశీపతి, లక్ష్మీరాజ్యం మొదలైనవారు నటించిన ' కాలచక్రం ' కాలగర్భంలో కలసిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు దాన్ని స్మరించేవాళ్ళే లేరు.

ఆ తర్వాత చాలా కాలానికి ' ఆహుతి ' అనే చిత్రంతో నేను సినిమారంగంలోకి స్థిరప్రవేశం చేసాను. ' ఆహుతి ' చిత్రం కూడా కాలానికి ఆహుతి అయిపోయింది. కానీ తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్ చిత్రంగా ఆది చరిత్ర సృష్టించింది. అందులోని ' ప్రేమయే జనన మరణ లీల ' అనే పాట ఇప్పటికీ తరచుగా మన రేడియోలలో వినబడుతూ వుంటుంది. ఆ పాట ప్రజాదరణ పొందటానికి అందులోని సాహిత్య పుష్టికన్నా సాలూరి రాజేశ్వరరావు సొంత బాణీ, ఘంటసాల కమనీయ కంఠం ముఖ్య కారణాలని నేననుకుంటున్నాను. సాహిత్య విలువలకైతే ' హంసవలె ఊగుచు రావే ' అనే పాటను నేనెక్కువ లైక్ చేస్తాను.

' ఆహుతి ' చిత్రం విడుదలైంది 1950 లో. అదే సంవత్సరం నా ' మహాప్రస్థానం ' గీతాలు గ్రంథరూపం దాల్చాయి. 
                                      
                                                                                   ................. మహాకవి శ్రీశ్రీ             



Vol. No. 01 Pub. No. 270

Monday, April 26, 2010

సినిమాల గురించి శ్రీశ్రీ



ఈ ఇమేజ్ పైన క్లిక్ చెయ్యండి.
 సినిమా అనేది ఒక బ్రహ్మాండమైన ఆయుధం. దానిని వినియోగించగల బ్రహ్మాండమైన కళాస్రష్ట మనలో ఇంకా బయలుదేరలేదు. ప్రస్తుతం ఆది చిటికెన వేలంతటి మనుషుల చేతిలో వున్నది. వారు కూడా దానిని తమ అల్ప ప్రయోజనాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు. బిర్లా, టాటాలు 501 సబ్బును, సిమ్మెంటు బస్తాలను ఉత్పత్తి చేస్తున్నట్లుగానే మన ప్రొడ్యూసర్లు ఈనాడు చిత్రనిర్మాణం చేస్తున్నారు.




అసలు ఉత్తమ చిత్రాలు నిర్మిస్తే మన ప్రజలు చూడరని చెప్పడం కూడా మన ప్రొడ్యూసర్లకు పరిపాటి అయింది. ఇది ఎంత అసందర్భంగా ఉన్నదో చెబుతా వినండి. ఆహారం విక్రయించడం ఒక వ్యాపారంగా నడపడం 20 వ శతాబ్దంలోనే ప్రారంభమయింది. ప్రతివాడూ తిండి కోసం హోటల్ కు వెళ్ళాలి. అతడికి ప్రతిసారీ ఆహారం ( మంచిది ) లభించకపోవచ్చు. అయినా రోజూ హోటల్ కు వెళ్లక తప్పదు.


ఆహారం వలెనే ఈనాడు మానవునికి సినిమాకూడా ఒక అవసరం - అందువల్ల ఏ చిత్రం వచ్చినా ప్రేక్షకుడు చూస్తున్నాడు. కానీ కంపుకొట్టే వేరుశెనగ నూనెతో చేసే వంటకాలనుకాని ప్రజలు ముట్టరని, వాటికి వాళ్ళు అలవాటు పడ్డారని యజమాని చెబితే ఎంత అసందర్భంగా ఉంటుందో ఉత్తమ చిత్రాలను నిర్మిస్తే ప్రజలు చూడరని చెప్పడం కూడా అలాగే వున్నది.


నాటకానుభవం లేని కవులు సినిమారచయితలుగా వస్తే, యతిప్రాసలు రానివారు కవిత్వం చెప్పడానికి పూనుకున్నట్లే ఉంటుంది. సినిమా రచయితలకు నాటకానుభవం ఉండి తీరాలి. శ్రీ పింగళి నాగేంద్రరావు గారికి అట్టి అనుభవం ఉన్నందువల్లనే " పాతాళ భైరవి " ( ఆంధ్ర ప్రభ లోని వ్యాసం లింక్ ) వంటి కాకమ్మ పిచికమ్మ కథలో అంత ' డ్రమెటిక్ ఎఫెక్ట్ ' తీసికొని రాగలిగారు.


సాధ్యమైనంత ఎక్కువ యాక్షన్ తోనూ, సాధ్యమైనన్ని తక్కువ సంభాషణలతోను నిర్మించినపుడు చిత్రం ఉత్తమంగా వుంటుంది. అందుకు సహాయభూతం కాగల నాటకానుభవం వున్న రచయిత తప్పకుండా దర్శక పదవిని ఆక్రమించవచ్చు. డైరెక్టర్ అంటే ' స్టార్ట్ ' , ' కట్ ' అని కేకలు వేసేవాడు మాత్రమే కాదు.


ఏమైనా ఏప్రజలకు తగిన ప్రభుత్వం ఆ ప్రజలకు లభించినట్లుగానే, ఆయా ప్రజల స్థాయిని బట్టి ఆయా సినిమాల స్థాయి కూడా వుంటుంది.


సుమారు మూడు దశాబ్దాల క్రితం ఆంధ్రజ్యోతి వార పత్రికలో  ప్రచురించిన మహాకవి శ్రీశ్రీ గారి వ్యాసం నుండి..........  

Mahasankalpam: Vacana kavita sankalanam, 1940-1975 = Mahasankalpam, an anthology of modern Telugu poetry from 1940 to 1975
  మహాకవిగారి సొంతగళం నుండి ప్రవహించిన  మహాప్రస్థాన గీతం  ......



Vol. No. 01 Pub. No. 269

Friday, April 9, 2010

పంజాబ ఆంధ్ర గుజరాత మరాఠా, ద్రావిడ ఉత్కళ వంగ ...........

A study of Telugu regional and social dialects: A prosodic analysis (CIIL silver jubilee publication series)A study of Telugu regional and social dialects: A prosodic analysis (CIIL silver jubilee publication series)

"  మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమిళ, కన్నడ, మరాఠీ, ఒరియా ప్రాంతాలు సరిహద్దులుగా వున్నాయి. ఈ ద్విభాషా ప్రాంతాల్లో ఆచార వ్యవహారాలు కొద్దిగానో, ఎక్కువగానో కలగాపులగం కావడం తప్పనిసరి ! తెలంగాణా తెలుగువారి మాటల్లో  ఉర్దూ యాస తప్పదు. కన్నడులు బహుళంగా గుండప్పలు, నంజుండప్పలు గదా ! అందువల్ల బెంగుళూరు తెలుగు వాళ్ళు ' ఏమండప్పా ! రండప్పా ! కూచోండప్పా ! ' అంటారు. యావదాంధ్రంలోను చదువుల తల్లి సరస్వతీదేవి వున్న ఒకే ఒక ఆలయం ఆదిలాబాదు జిల్లాలో వుంది. అక్కడ ఆంధ్రులు తెలుగు కలిసిన మరాఠీతోను, మరాఠీ కలిసిన తెలుగుతోను మాట్లాడుకుంటారు. ఇటు అరకుగానీ, ఇచ్చాపురంగానీ వెళ్ళి చూడు. అక్కడ మన వాళ్ళ భాష తెలుగు ఒరియా కలిసిన మణిప్రవాళంలా వుంటుంది. ఆ మాట కొస్తే వివిధ సంస్కృతుల సమ్మేళనమే గదటయ్యా నేటి మానవ నాగరికత ! నువ్వానాడు తెలుగుభాష అనుకునేది ఏనాటి ఏయే భాషల మిశ్రమమో చెప్పగలవా ? అట్లాగే ఆచారాలూ వ్యవహారాలూ అన్నీ ! సంకరంగాని మతం, సంకరంగాని కులం, సంకరంగాని భాష ఈ ఇలాతలంపైన ఉన్నాయంటావా ? పోనీలే, ద్విభాషా ప్రాంతంలో నివసించే మేము అసలు తెలుగు వాళ్ళమైతే కాకపొవచ్చునుగానీ, మీకులేని సదుపాయం మాకొకటి వుంది. మాతృభాషతో బాటుగా మాకు మరొక దేశ భాష సునాయాసంగా అబ్బుతుంది. అందువల్ల మాకు విజయవాడ ఎంతో తంజావూరూ అంతే ! తల్లి కృష్ణమ్మ ఎంతో అన్నై కావేరీ అంతే ! విశ్వనాథ వారి ' వేయిపడగ ' లెంతో , కల్కి రచన ' శివగామియున్ శపథమూ ' అంతే ! నా కత్తికి రెండంచులూ పదునేనయ్యా ప్రసాదరావ్ ! నా భాగ్యం  తక్కువైందేమీ కాదు. నిజానికి నన్ను చూసి అసూయ పడాలి నువ్వు ! " 
అంటాడు వెంకటేశం - సరిహద్దు ప్రాంతమైన చిత్తూరు జిల్లా భాషను సంకరభాష అని, అక్కడి ప్రజలు అసలైన తెలుగు వాళ్ళు కారని వాదించిన ప్రసాదరావు తో.

చిత్తూరు జిల్లానుండి వయోజన విద్యా శిక్షణా శిబిరంలో పాల్గొనడానికి కృష్ణా జిల్లా బందరు వచ్చిన వెంకటేశంతో గుడ్లవల్లేరుకు చెందిన ప్రసాదరావు అనబడే దుర్గావరప్రసాద మల్లిఖార్జున రావు తరచుగా ఈ విషయంలో వాదనలేసుకునే వాడు. చిత్తూరు వాళ్ళ భాషను అవహేళన చేస్తూ....  
కట్టూ బొట్టూ, మాటాడే తీరు, తినే తిండి - ఇలా ఏ అంశాన్ని బట్టి చూసినా ఆపాదమస్తకం తెలుగు వాళ్ళం మేమేనని ఢంకా బజాయించి చెప్పేవాడు.

వెంకటేశం కూడా తమను సమర్థించుకోవడానికి ప్రతిగా ఎంత వాదించినా కొట్టిపారేసేవాడు. ఈ ఒక్క విషయంలోను తప్ప మిగిలిన విషయాలన్నిటిలో ప్రసాదరావు చాలా మంచివాడు, ఉదారుడు, స్నేహ పాత్రుడు కావటం వల్ల వెంకటేశం అతని స్నేహాన్ని వదల్లేకపోయాడు. శిక్షణ ముగియడంతో ఎవరి తోవ వారిదైంది. దాదాపు పదిహేను సంవత్సరాలదాకా వారి స్నేహం కేవలం ఉత్తర ప్రత్యుత్తరాలకే పరిమితమైంది.

ఒకసారి దక్షిణాది యాత్ర పూర్తి చేసుకుని హఠాత్తుగా వెంకటేశం దగ్గరికి వచ్చాడు ప్రసాదరావు. ఇంట్లోకి అడుగుపెడుతూనే.......
" అహా ! ఎంత బాగుందోయ్ మీ వూరు ! చుట్టూరా కొండలు, మామిడి తోటలు, ముచ్చటగా ఓ ఏరు, దాని గట్టు వెంబడి కొబ్బరి చెట్లు...."
అని మైమరచిపోయాడు.

" బాగుండారా అన్నా ! ఈయన ఎన్నిసార్లు చెప్పినాడో మిమ్మల్ని గురించి ! ఇంత కాలానికి మా పైన దయకలిగింది " అని నోరారా పలకరించిన వెంకటేశం భార్యను చూసి ఇంటికి మొదటిసారిగా వచ్చిన తనను ' అన్నా ' అని అప్యాయంగా పలకరించడం చూసి పరవశించిపోయాడు.

" ఏందేందో చెప్పినారు గానీ, మనిషి చాలా మంచాయనలా వున్నాడు గదండీ ! "
అని నిలదీసిన భార్యతో ఆ మనిషిని మెప్పించడం కష్టమని, ఎలాగైనా తన పరువు నిలబెట్టమని బ్రతిమాలతాడు వెంకటేశం.

ఆమె వడ్దించిన పప్పుల పొడి, కూర అని వేసిన ములగకాడల పులుసు, రసం తయారీ విధానాలను తెలుసుకుంటూ వాటి రుచుల్ని అస్వాదిస్తూ ఆవిడ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని కీర్తిస్తూ భోజనం ముగిస్తాడు ప్రసాదరావు.

సాయింత్రం ' సైట్ సీయింగు ' అంటూ ఊళ్ళోకి వెళ్ళి ఆ ఊరి అందాన్ని కీర్తిస్తున్న అతనితో......... 
" పోనీలే ప్రసాదరావ్ ! నీకెట్లాగూ మా భాషంటే సరిపడదు. మా ప్రాంతమైనా నచ్చింది చాలు. అదే పదివేలు. "
అని సంబరపడుతున్న వెంకటేశంతో

" అబ్బే, అదేం లేదు లేవోయ్ ! ఈ మధ్య విస్తృతంగా దేశం తిరిగొచ్చాను గదా ! నా అభిప్రాయాలు మార్చుకున్నా. మహాకవులు వ్యాకరణ విరుద్ధమైన ప్రయోగాలు చేస్తారనుకో ! ఏమిటిలా చేశారని మనం అడగ్గూడదట ! ' మహాకవుల ప్రయోగమ్ములు యథాతథంగా గ్రాహ్యంబులు ' అంటాడు శాస్త్రజ్ఞుడు. ప్రజల విషయమున్నూ అంతే ! ' పదుగురాడు మాట పాడియై ధరచెల్లు ' అంటారు గదా ! అవును మరి ! ప్రజల భాషను తప్పు పట్టడానికి మనమెవరం ? ఇప్పుడా పట్టింపులేవీ లేవు. కొంచెం ఆలోచన, కొంచెం వివేచన వచ్చాక అతిశయం గాలిలో బూరగ దూదిలా ఎగిరిపోయిందనుకో ! "
అంటాడు ప్రసాదరావు.

మార్పు మానవ స్వభావం. కొందరు బింకానికి పోయి పాత అభిప్రాయాలకే అంటి పెట్టుకున్నట్టు నటిస్తారు. అలా కాకుండా తమ అభిప్రాయాల్లో మార్పు వచ్చినట్లుగా ఒప్పుకోవడం ఉత్తమ సంస్కారం లక్షణం. 
 ఆ కారణంగానే ప్రసాదరావు వ్యక్తిత్వంపట్ల గౌరవం పెరిగిపోతుంది వెంకటేశానికి.

అరవం అక్షరం ముక్కకూడా రాకుండా దక్షిణాది అవసరానికి సరిపడా భాషా పరిచయాన్ని సంపాదించిన వైనాన్ని వర్ణిస్తాడు ప్రసాదరావు.  

ఆ రోజు రాత్రి మంత్రపేటిక లాంటి తన సూట్కేసు తెరిచి పూంబుహార్ లో కొన్న తిరువళ్ళువర్ విగ్రహాన్ని వెంకటేశానికి, నాగపట్నంలో కొన్న ముత్యాల గాజుల్ని ' చెల్లమ్మా ! ఇది నీకు '
అంటూ అతని భార్యకు ఇస్తాడు. ఎవరెవరి కోసం ఏమేం కొన్నాడో తీసి చూపిస్తాడు.

చివరగా " నీకోసం నువ్వేమి  కొనుక్కున్నావయ్యా ? "
అని అడిగిన వెంకటేశంతో     

"  ఇదిగో, ఇది నా కోసం "  అంటూ ఓ పుస్తకం తీసి చూపిస్తాడు. 

ఆ పుస్తకం పేరు  ' ముఫ్ఫై రోజుల్లో తమిళ భాష - తెలుగు ద్వారా '


.............................................


                                     ఇదీ మధురాంతకం రాజారాం గారి  
' పంజాబ ఆంధ్ర గుజరాత మరాఠా, ద్రావిడ ఉత్కళ వంగ ..........
కథా పరిచయం.

మధురమైన కథలెన్నిటినో రచించిన రాజారాం గారు భాషా బేధాలను, ప్రాంతీయ బేధాలను విశ్లేషిస్తూ రాసిన కథ ఇది. ఆయన శైలి సరళం. చెప్పదలచుకున్నది సూటిగా గందరగోళం లేకుండా చెప్పడం ఆయన పద్దతి. ఆయన కథలకు వ్యాఖ్యానాలు, ఉపాఖ్యానాలు అవసరంలేదు.
ఉపాధ్యాయ వృత్తిలో వుంటూ ఆయన కలుసుకున్న విభిన్న మనస్తత్వాలను, అనుభవాలను ఆధారంగా చేసుకుని ఆయన చాలా కథలు రాసారు.  ఎన్నో కథా సంపుటాలు వెలువడ్డాయి. సుమారు పదిహేడేళ్ళ క్రితం రాసిన కథ ఇది.

గమనిక : ఇటాలిక్స్ లో వున్న భాగాలు ఆయన కథలోంచి యథాతథంగా తీసుకున్నవి.

Vol. No. 01 Pub. No. 250

Sunday, March 14, 2010

మనకు తెలియని మన చరిత్ర

తొలి తెలుగు కథా రచయిత్రి భండారు అచ్చమాంబ కథా సంపుటి త్వరలో వెలువడబోతోంది. ఆ సందర్భంగా ఈరోజు ( 15 మార్చ్  2010 ) ఆంధ్రజ్యోతి దినపత్రికలో 'వివిధ ' శీర్షికలో అచ్చమాంబ-మనకు తెలియని మన చరిత్ర పేరుతో శ్రీ కె. శ్రీనివాస్ రాసిన సమగ్ర వ్యాసం ఇక్కడ చదవండి.





Vol. No. 01 Pub. No. 226

అందరికీ ఒక్కడే దేవుడు

శ్రీ రహమతుల్లా గారు పంపిన మరో మంచి పాట మీకోసం......................

అందరికీ ఒక్కడే దేవుడు
కొందరికి రహీము కొందరికి రాముడు
ఏ పేరున పిలిచినా దేవుడు ఒక్కడే దేవుడొక్కడే [[అందరికీ]]

పూలలో ఉన్నాయి వేలరకాలు
పక్షులలో ఉన్నాయి లక్షవిధాలు
రేకులు ఉంటేనే పువ్వంటాము
రెక్కలు ఉంటేనే పక్షంటాము
మతాలు ఏవైనా కులాలు వేరైనా
మంచిమనసు ఉంటేనే మనిషంటాము
మనుషులమై మనమంతా కలిసుంటాము [[అందరికీ]]

పై వేషం చూసి నీవు భ్రమపడరాదు
మేడిపండు మెరుగంతా మేలిమికాదు
ఎక్కడో దేవునికై ఎందుకు వెదికేవు?
పక్కనున్న మానవుని ఎందుకు మరిచేవు?
మానవసేవే మాధవ సేవ
బాధపడే సోదరులను ఆదుకునేను
మనుషులమై మనమంతా కలిసుంటాము [[అందరికీ]]

కష్టపడే నీతిపరుని కడుపు నిండదు
దోచుకునే దొరగారికి తృప్తి ఉండదు
స్వార్ధపరుల ఆట మనం కట్టిస్తాము
శ్రమజీవుల కష్తఫలం ఇప్పిస్తాము
అహింస బోధిస్తాం ప్రశాంతి సాధిస్తాం
లోకంలో ఆకలే లేకుండా చేస్తాము
మనుషులమై మనమంతా కలిసుంటాము [[అందరికీ]]




--- ఈ పాట 1970 లో వచ్చిన ' ఒకే కుటుంబం ' చిత్రంలోనిది. దాశరథి రాసిన ఈ పాటకు స్వరకల్పన ఎస్. పి. కోదండపాణి. పాడింది ఘంటసాల.

శ్రీ రహమతుల్లా గారు పంపిన మరో మంచి పాట గతంలో ఆకాశవాణిలో పలుమార్లు వినిపించిన లలిత గీతం.

నారాయణ నారాయణ అల్లా అల్లా
మా పాలిట తండ్రీ నీ పిల్లలమేమెల్లా || నారాయణ ||


మతమన్నది నాకంటికి మసకైతే

మతమన్నది నా మనసుకు మబ్బైతే
మతం వద్దు గితం వద్దు మాయామర్మం వద్దు || నారాయణ ||

ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే
కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే
మతం వద్దు గతం వద్దు
మారణ హొమం వద్దు || నారాయణ||

మతమన్నది గాంధీజీ హితమైతే
మతమన్నది లోకానికి హితమైతే
హిందువులం ముస్లిములం
అందరము మానవులం,
అందరమూ సోదరులం || నారాయణ ||

---దేవులపల్లి కృష్ణశాస్త్రి


ఈ పాట ఆడియో గతంలో నా దగ్గర ఉండేది. ప్రస్తుతం కనిపించడం లేదు. మిత్రులెవరిదగ్గరైనా వుంటే అప్ లోడ్ చెయ్యగలరు.

శ్రీ రహమతుల్లా గారు అడిగిన మరో పాట

ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవమూ
ఎల్లమతముల సారమొకటే
తోటకెల్ల వసంతుడొకడే
.......గుడి గంట ఒకటే

ఈ పాట బహుశా సినారె గారు రాశారనుకుంటా.మొత్తం పాట తెలిసినవారు బ్లాగులో పెట్టండి.


Vol. No. 01 Pub. No. 225

Sunday, February 14, 2010

కొన్ని ప్రశ్నలు - శ్రీశ్రీ సమాధానాలు


ప్రశ్న : 1+1 = 1 ఎలా అవుతుంది ?
శ్రీశ్రీ : ప్రేయసీ + ప్రియులు = ఇద్దరు ఒక్కటే !
       దేవుడు + మానవుడు = ఇద్దరు  ఒక్కటే !

ప్ర :  శ్రీశ్రీకి కుడికన్ను అదురుతుందా ?
శ్రీశ్రీ : శ్రీశ్రీ ఎప్పుడూఎడమ ప్రక్కనే ఉంటాడు. కుడిప్రక్కన ఉండడు. పుట్టిన దగ్గరనుండి ఎడమ కాలు, ఎడమ చెయ్యి అలవాటు. కొంతకాలం ఎడమ చేత్తోనే రాసేవాణ్ణి.

 ప్ర : శ్రీశ్రీ అంటే అర్థమేమిటి ?
శ్రీశ్రీ :  చాలా ఉన్నాయి. శ్రీశ్రీ రచనలు ఎంతమంది చదివారో అన్ని అర్థాలు.

ప్ర : తెలంగాణా ప్రజల కోరికలు అర్థరహితమా ?
శ్రీశ్రీ : ఏ ప్రజల కోరికలు అర్థరహితం కావు. వాళ్ళ తరఫున వకాల్తా పుచ్చుకునే వినాయకుల వ్యాఖ్యానాలే అర్థరహితమైనవి. 


ప్ర:: మీ కవిత్వం చూస్తే ఆవేశం, మీ ప్రవర్తన చూస్తే అసహ్యం. మీరేమంటారు ?
శ్రీశ్రీ : నా ప్రవర్తన నాతోనే అంతమవుతుంది. నా కవిత్వం తెలుగుజాతి ఉన్నంత కాలం నిలుస్తుంది.

 Vol. No. 01 Pub. No. 197

Thursday, February 4, 2010

తెలుగులో హాస్య నాటిక రచయితలు

తెలుగులో హాస్యనాటికా ప్రక్రియ ప్రారంభమై సుమారు 132 సంవత్సరాలయింది. వాటి పరిణామ క్రమం, ఆ రచయితల పరిచయం క్లుప్తంగా ...................



Vol. No. 01 Pub. No. 183

Friday, January 8, 2010

శ్రీశ్రీ శ్రవ్య నాటికలు

రంగస్థలం మీద ప్రదర్శించే దృశ్య ప్రధానమైన నాటికలకు భిన్నమైనవి శ్రవ్య నాటికలు. దృశ్య నాటికలు గానీ, నాటకాలు గానీ సంభాషణలకంటే నటుడి / నటి హావభావాల ద్వారా రచయిత / ప్రయోక్త చెప్పదలచుకున్న సందేశాన్ని ప్రేక్షకులకు అందిస్తాయి. కానీ శ్రవ్య నాటిక / నాటకానికి ఆ సౌలభ్యం లేదు. అక్కడ దృశ్యం ఉండదు. ప్రేక్షకులుండరు. కేవలం శ్రోతలు మాత్రమే ఉంటారు. రచయిత సంభాషణలలోనే దృశ్యాన్ని అందించగలగాలి. నటీనటులు తమ హావభావాలను సంభాషణలలోను, చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ ద్వారాను వ్యక్తం చెయ్యగలగాలి. అందుకే శ్రవ్య నాటిక రచన దృశ్య నాటిక రచన కంటే కష్టమైనది.

1980 దశకం వరకూ సామాన్యుడికి అందుబాటులో వున్న ఏకైక ప్రధాన ప్రసార మాధ్యమం ' రేడియో ' అదే 'ఆకాశవాణి '. మన దేశంలో స్వాతంత్ర్యానికి పూర్వమే ప్రాచుర్యంలోకి వచ్చిన రేడియో తర్వాత సామాన్య జనం జీవితాలలో విడదీయరాని భాగమైపోయింది. అప్పట్లో నాటకాలంటే దసరా, వినాయక చవితి మొదలైన ఉత్సవాల సమయంలోనో, అరుదుగా ఇతర సమయాలలోను ప్రదర్శించేవే ! రేడియో ప్రాచుర్యంలోకి వచ్చాక శ్రవ్య నాటక యుగం ప్రారంభమైంది. ప్రసిద్ధ నటుల రంగస్థల నాటకాలు గ్రామఫోన్ రికార్డులుగా వచ్చినా అప్పట్లో గ్రామఫోను కూడా లగ్జరీనే కావడం వలన అవి శ్రవ్య రూపంలో కన్న దృశ్య రూపంలోనే ఎక్కువ ఆదరణ పొందాయి. రేడియో శ్రవ్య నాటకాలను ప్రోత్సహించింది. ఎన్నో మంచి నాటకాలు వచ్చాయి. మరెన్నో మంచి నాటకాలు, కథలు, నవలలు శ్రవ్య నాటికలు, నాటకాలుగా రూపాంతరం చెందాయి. ప్రత్యేకంగా శ్రవ్య నాటకాలను రచించే రచయితలతో బాటు కొందరు ప్రసిద్ధ కవులు, రచయితలు అనేక రూపాల్లో శ్రవ్య నాటక రచన సాగించారు.

వారిలో మహాకవి శ్రీశ్రీ కూడా ఒకరు. ఆయన రేడియో కోసం రచించిన నాటికలు అప్పట్లో ప్రయోగాత్మకమైనవనే చెప్పాలి. వాటిల్లో కూడా ఆయన సామాన్య జనం తరఫునే నిలిచారు. వాటిల్లో కూడా ఆయనకే ప్రత్యేకమైన శైలి కనబడుతుంది. 1962 వరకూ రేడియోలో ( ఎక్కువగా మద్రాసు ఆకాశవాణి కేంద్రం నుండి ) ప్రసారమైన శ్రీశ్రీ నాటికల్ని' 1+1 = 1 మొదలైన రేడియో నాటికలు' అనే పేరుతో సంకలీకరించారు. ఆ నాటికలలో ఒకటి ఇంతకు ముందు టపాలో పరిచయం చేసిన ' గుమాస్తా కల ' . శ్రీశ్రీ రచనలు ' మహాప్రస్థానం ' 'సిరిసిరి మువ్వ ' ' ఖడ్గసృష్టి ' లాంటి కవితా ఖండికలు గుర్తున్నంతగా ఆయన నాటికలు గుర్తుండవు. మరోసారి ఆ మహాకవి రచించిన నాటికల్ని గుర్తు చేసే చిన్ని ప్రయత్నం ఈ పరిచయం.

Vol. No. 01 Pub. No. 154

Thursday, January 7, 2010

గుమాస్తా కల

ఆశ : అమెరికా దేశం కోనేటిరావును ఆహ్వానించింది.

భయం : అమెరికా ఎందు కాహ్వానించింది అతణ్ణి ?

ఆశ : ప్రపంచంలో ఈయన్ని మించిన ఇంజనీయరు లేడని.

ఆహ్వాన
పత్రం
ప్రపంచ ప్రథమ పౌరునికి అమెరికా స్వాగతం. మా ఆతిథ్యం మీరు స్వీకరించాలి. మా టేన్నేస్సీ లోయను తమరు తనిఖీ చెయ్యాలి. అమూల్యమైన మీ సలహాలను శిరసావహిస్తాము. సిఫారసులను తక్షణం అమలు చేస్తాము...(కరతాళ ధ్వనులు )

కోనేటి
: అబ్బే ! అదెంతమాట ! అల్పజ్ఞుణ్ణి. నన్నేదో పెద్దవాణ్ణి చేసి పొగుడుతున్నారు. నా మాత్రం తెలివైనవాళ్ళు మీ అమెరికాలో లేకపోయారా ? ఆంధ్రదేశం నుంచి ప్రత్యేకం నన్నిక్కడ కాహ్వానించడం మీ ఔదార్యాన్నే చాటుతోంది. అయినా సన్మానం నాదికాదు. ఆంధ్రదేశానిదీ గౌరవం.

(
చంటి పిల్ల ఏడ్చిన చప్పుడు. కోనేటిరావుకు మెలుకువ వస్తుంది. )

***********


భయం : ఈమారేమిటి ? సముద్రంలో ఏం చేస్తున్నాడు ?

ఆశ
: ప్రపంచ మహాయుద్ధాన్ని భావిస్తున్నాడు.

భయం : ఓహో ఎంత దివ్యంగా ఉంది. యుద్ధంలో కోనేటిరావు ప్రధాన పాత్రధారి కాబోలు.

ఆశ : ఔను. ఈసారి ఈయన జర్మన్ సబ్మేరిన్ కమాండర్ జటాఫట్ కొనేట్.

భయం : అయితే ?

ఆశ : అట్లాంటిక్ మహాసముద్ర గర్భంలో అతని జలాంతర్గామి తిమింగలంలాగ విహరిస్తోంది.

-----

కోనేటి : వేల్దాన్ షాంగ్ డెర్ ఉంటార్ డెన్ లిండెన్ ! గేస్తాల్ట్ డెర్ డాయిష్లాండ్ ఊబర్ ఆల్స్ .

ఆశ : మంచినీళ్ళ ప్రాయంగా జర్మన్ భాష మాట్లాడేస్తున్నాడు.

భయం : మాటకి అర్థం ఏమిటి ?

ఆశ : మాటలేమైనా ఫలితం ప్రధానం. తునా తునియలై పోయింది శతృనౌక.

--------

ఆశ : శతృ నావికులమీద మెషీన్ గన్లు పేల్చమని తన తరఫువారికి ఆర్డర్లు ఇస్తున్నాడు.

కోనేటి : ఫోల్కిషేర్ బియో బాక్టర్ ! గెహన్నా, ఆఖ్ టుంగ్, జైట్ గైన్ట్ ! మైన్ క్యాంప్.

( పిల్లి పాలగిన్నెను పడతోసిన చప్పుడు, తుళ్ళిపడిలేస్తాడు కోనేటి రావు )

***********

ఆశ : కోనేటిరావు కథానాయకుడుగా సినిమాలో నటిస్తున్నాడు.

భయం : యాభై యేళ్ళ కోనేటిరావు.

ఆశ : కలలో కోనేటిరావు వయస్సు పాతికేళ్ళే. బహుశా ఇంకాతక్కువ. కలలో కోనేటిరావు స్థూలకాయుడు కాదు. ఆజానుబాహువు. సౌందర్యాపరమత్స్య లాంచనుడు. కళా సర్వజ్ఞుడు కూడాను.

భయం : కథానాయిక ఎవరు ?

ఆశ : అతని స్వప్నసుందరి.

------

ఆశ : కథానాయిక అనేకమైన ఇబ్బందులలో, అరణ్యాలలో - భయంకర మృగాల మధ్య, నగరాలలో భయంకర పరిస్థితుల మధ్య చిక్కుకుంటుంది. ఆమెను కథానాయకుడు రక్షిస్తాడు. వారు పరస్పరం ప్రేమించుకుంటారు.

------

ఆశ : సౌందర్యం సమక్షంలో కోనేటిరావు నిలుచున్నాడు. అతని హృదయంలో ప్రేమ సంగీత రూపంలో ప్రవహిస్తోంది. కథానాయిక అతని ప్రేమని గానంతో అంగీకరించింది. కథలో అతడే సత్యవంతుడు. ఆమె సావిత్రి. అతడు రోమియో. ఆమె జూలియట్. అతడు కోనేటిరావు. ఆమె కోనేటిరాణి.

**********

భయం : అసలీ కోనేటి రావెవరు ?

ఆశ : అనంతకోటి కచేరీలలో ఒక గుమాస్తా.

భయం : అనధికారరీత్యా అతనికేమీ హోదా లేదా ?

ఆశ : కోనేటిరావు అందరిలోనూ,అందరిలాగే ఒక మానవుడు, సంసారి. పెళ్ళాన్నీ, పిల్లల్నీ ప్రేమిస్తాడు. కానీ తరచూ వాళ్ళ మీదా, తన మీదా విసుక్కుంటాడు. అతని జీవితంలో స్మరించదగ్గ సంఘటన లేవీ లేవు. సాహిత్య రంగంలో అతనికి నాయకత్వంలేదు. పత్రికలలో అతని పేరు కనబడదు. ప్రపంచంలో అతని పేరు వినబడదు. అతని నిజమైన జీవితం ఒక స్వప్నం. అతని స్వప్నం సాధ్యంకాని అబద్ధం.

() ******** ()

ఇదీ ఓ సగటు గుమాస్తా కలల ప్రపంచం. మహాకవి శ్రీశ్రీ రాసిన ' గుమాస్తా కల ' అనే రేడియో నాటికలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలు. సామాన్య మధ్య తరగతి మానవుని అంతరంగాన్ని ఇంతకంటే బాగా ఆవిష్కరించడం ఇంకెవరికైనా సాధ్యమా ? శ్రీశ్రీ కి మాత్రమే ఆ అథారిటీ ఉంది. సామాన్యుడు కలలు మాత్రమే కనగలడు. అవి తీర్చుకునే మార్గాలు లేవనుకోవడం నిరాశావాదం. కానీ శ్రీశ్రీ ఆశావాది. అందుకే ఆయన ఈ నాటికలో .......

మానవుడు కలలు కనడం మానలేడు. కోనేటిరావు జీవితంలో అవి ఫలింపక పోవచ్చును. మరో జీవితంలో, ఇంకో కాలంలో మానవజాతి తన స్వప్నాలను సాధించగలుగుతుంది.

......... అంటారు.

సామాన్యుడిలోని ఆశ, భయం ల మధ్య జరుగుతున్న సంభాషణ రూపంలో ఈ నాటిక సాగుతుంది. కోనేటిరావు లాంటి ఒక మామూలు గుమాస్తా తన ఆశల్ని, తన భయాల్ని నిద్రలో, కలల్లో సాక్షాత్కారించుకుంటాడు. ఆ కలల్లో అతని ఆశలు తీరుతాయి. అతని భయాలు పారిపోతాయి. ఆ కలల్లో అతను ఒక మేధావి. ఒక యోధుడు. ఒక హీరో. ఒకటేమిటి. నిజ జీవితంలో అతనేం కాలేడో....కలల్లో అవన్నీ కాగలడు !

సామాన్య మానవుడి తరఫున వకాల్తా పుచ్చుకున్న శ్రీశ్రీ గురించి, ఆయన రచనల గురించి సమీక్షించడం సూర్యుడి ముందు దివిటీ వెలిగించడమే ! అందుకే ఇది సమీక్ష కాదు. కేవలం ఆయన నాటిక పరిచయం మాత్రమే !

Vol. No. 01 Pub. No. 153

Tuesday, December 8, 2009

'రంగుటద్దాల కిటికీ' ఆవిష్కరణ వివరాలు

ముందుమాట :

ఆవిష్కరణకు ముందుగా అనుకోక పోవడం వలన తగిన ఏర్పాట్లు చేసుకోక మిత్రులందరికీ వీడియో రూపంలో అందించలేక పోయాను. దానికి కారణం కొత్తపాళీ గారు తన కార్యక్రమాల బిజీలో ఉండటం వలన రోజు వరకు కలుసుకోలేక పోవడంతో ముందుగా ప్రణాళిక రూపొందించుకోలేకపోయాను. ఆఖరి నిముషంలో అనుకున్నా నా కామ్ సమస్య వలన చిన్న డిజిటల్ కెమెరా తీసుకెళ్ళాను. మొదట ఫోటోలు తీసుకోవడం నా కోసమే అనుకున్నా రాత్రి ఇంటికి వచ్చాక మిత్రులందరికీ కూడా అందించాలని అనిపించింది. వెంటనే షో తయారుచేసి ప్రచురించేసేశాను. తర్వాత గానీ వెలగలేదు. కొత్తపాళీ గారి అనుమతి తీసుకోలేదని ! అసలే బ్లాగు లోకానికి కొత్త. కొత్తగా ఏర్పడిన కొత్తపాళీ గారి పరిచయం చేడిపోతుందేమోననే అనుమానంతో బాటు నా అత్యుత్సాహాన్ని బ్లాగు మిత్రులు కూడా అపార్థం చేసుకుని దూరం పెడతారేమోననిపించింది. సృష్టిలో తీయనిది స్నేహమే కదా ! ఎదుటి వారికి నచ్చని పని చేసి స్నేహం చెడగోట్టుకోవడం కంటే పని చెయ్యకుండా ఉండటమే మేలనిపించింది. వారికి ఫోన్ చేసి అనుమతి కోరదామంటే అప్పటికే అర్థరాత్రి దాటి చాలాసేపయింది. అప్పుడడగడం భావ్యం కాదనిపించింది. సరే ఏమైతే అయిందిలే అని ప్రచురించేసాను. అన్నమంతా పట్టి చూడాలా ! ఒక్క మెతుకు చాలదా ! ఉడికిందో లేదో తెలుసుకోవడానికి !! అలాగే రోజు మొదటి కలయికే ఆయనలోని స్నేహశీలతను, అందులోని గొప్పదనాన్ని తెలిపింది. నా టపాకు ఆయన స్పందన జత కలిసింది. ఆయనే కాదు వారి శ్రీమతి సావిత్రి గారు, మామగారు శ్రీ సుబ్బారావుగారు మమ్మల్ని ఆప్యాయంగా పలుకరించిన తీరు వారి ఉన్నత సంస్కారానికి నిదర్శనం. నా జీవనయానంలో నాకు పరిచయమైన మరొక స్వచ్చ్హమైన స్నేహం కొత్తపాళీ గారిది అనుకుంటున్నాను. ఇక అసలు కథలోకి...

06-12-09 తేదీ సాయింత్రం 04-45 లకే సభాస్థలికి చేరుకున్నాను. బ్లాగుల్లో ఇచ్చుకున్న ఫోటోల సాయంతో ఇద్దరం ఒకరినొకరం సులభంగానే పోల్చుకున్నాం ! సాదరంగా ఆహ్వానించారు. ఇంకొక ఆనందకరమైన విషయం చెన్నై నుండి కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వచ్చిన మరో బ్లాగ్ మిత్రులు శ్రీ భైరవభట్ల కామేశ్వర రావు గారిని కలవటం. నిర్ణీత సమయానికి కంటే కేవలం 10 నిముషాలు మాత్రమే ఆలస్యంగా సభ ప్రారంభమయింది.
సభకు
విశ్రాంత అధ్యాపకులు శ్రీ వై. చక్రధరరావు గారు అధ్యక్షత వహించారు.

మరో విశ్రాంత అధ్యాపకులు, శ్రీ ఎం. వి. సుబ్బారావు గారు ' రంగుటద్దాల కిటికీ ' ని తెరిచారు.. అదే... ఆవిష్కరించారు. మనందరికీ పుస్తకాన్ని అందించిన సుబ్బారావుగారు కొత్తపాళీ గారికి మాత్రం సావిత్రి అనే ఆణిముత్యాన్ని అందించిన మామగారు కావటం విశేషం.

రచనైనా పాఠకుల చేత చదివించడానికి సమీక్షలెంతో ఉపయోగపడతాయి. అదీ మంచి సమీక్షకారుడి చేతిలో పడటం నిజంగా రచయిత అదృష్టం. అదృష్టం కొత్తపాళీ గారికి శ్రీ వంశీకృష్ణ గారి రూపంలో వరించింది. స్వతహాగా రచయిత అయిన వంశీకృష్ణ గారు చక్కగా , విపులంగా , ఆసక్తికరంగా పుస్తకంలోని కథల్ని మీక్షించారు. అనవసరమైన విమర్శలు, అక్కర్లేని పొగడ్తలు లేకుండా రచయిత అంతరంగాన్ని, ఆలోచనల్ని స్పృశిస్తూ సాగిందా సమీక్ష. అరటి పండు వొలిచి చేతిలో పెట్టినట్లు అప్పటికింకా కథల్ని చదవని నాలాంటి వాళ్లకు కూడా అర్థమయ్యేటట్లు వివరించారు వంశీకృష్ణగారు.

నాటి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అధికార భాషా వాది , స్పెషల్ డిప్యూటి కలెక్టర్ శ్రీ ఎన్. రహమతుల్లా లు కంప్యూటర్ వినియోగదారులు సులభమైన రీతిలో ఉపయోగించగలిగే తెలుగు సాఫ్ట్వేర్ లు రూపోందించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఉద్యోగ రీత్యా ఆయన పరిశీలించి, పరిష్కరించిన పరిపాలనలో ప్రజల భాషా సమస్యలను ఉదాహరిస్తూ రంగంలో ఇంకా కృషి జరగాలన్నారు.

ప్రముఖ రచయిత్రి శ్రీమతి పి. సత్యవతి గారు మాట్లాడుతూ కొత్తపాళీ గారి కథల్లో వైవిధ్యాన్ని, అమెరికా సమాజం నేపథ్యాన్ని ఆయన ఉపయోగించుకున్న తీరుని అభినందించారు. ముఖ్యంగా స్త్రీ, పురుష సంబంధాలను, విలువలను ఆయన చిత్రీకరించిన పద్ధతిని ఆమె ప్రశంసించారు.

ఆనాటి సభలో ముఖ్య ఆకర్షణ కొత్తపాళీగారి మాతృమూర్తి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారి మిత్రురాలు, సహాధ్యాయి చేసిన ఉద్వేగ భరితమైన ప్రసంగం. వయోభారం కూడా లెక్క చెయ్యకుండా సభకు హాజరయి తమ స్నేహానుభూతుల్ని తలచుకోవడం, కొత్తపాళీ గారికి ఆయన తల్లిగారి తరఫున ఆశీసులందించడం సభికుల్ని కదిలించింది. ( క్షమించాలి ఆవిడ పేరు గుర్తులేదు )

సభకు మన బ్లాగ్మిత్రులు నవ్వులాట శ్రీకాంత్, తెలుగు కళ పద్మకళ కూడా హాజరయ్యారు.

చివరగా ' రంగుటద్దాల కిటికీ ' ని అందించిన రచయిత, మన బ్లాగ్మిత్రుడు కొత్తపాళీ గారు సమాధానమిస్తూ కథలు రాయడానికి, అవి ప్రచురించడానికి స్పూర్తినిచ్చిన మిత్రుల్ని, పరిస్థితుల్ని తలుచుకున్నారు. కథా సంపుటి ప్రచురణలో సహకరించిన శ్రీశ్రీ ప్రింటర్స్ వారికీ , ఆవిష్కరణ సభను ఏర్పాటు చేసిన విజయవాడ సాహితీ మిత్రులకు, పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు చెప్పి సభ ముగించారు.

అట్టహాసాలు, ఆర్భాటాలు ఏమీ లేకుండా చక్కటి ఆహ్లాదకరమైన కుటుంబ వాతావరణంలో జరిగిన సంబరం మరిచిపోలేని తీపి జ్ఞాపకం.

Vol. No. 01 Pub. No. 131