Showing posts with label వర్తమానం. Show all posts
Showing posts with label వర్తమానం. Show all posts

Saturday, June 5, 2010

పంచభూతాలు - ప్రకృతి

పంచభూతాలు ప్రకృతిమాత మనకు ప్రసాదించిన వరాలు
మహాజ్ఞానులమనే అజ్ఞానంతో మనం విర్రవీగితే
మిగిలేది శూన్యమే !

ప్రకృతి మాత వొడిలో మానవుడు ఎప్పుడూ బాలుడే !
ఆది తెలుసుకుంటే ప్రకృతి మనకెప్పుడూ అమ్మ వొడే !
అప్పుడంతా ఆనందమే !

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఓ చిన్న విన్నపం..........

 


Vol. No. 01 Pub. No.310

Tuesday, May 18, 2010

ప్రకృతికి ప్రశ్నలు

 మొన్న క్రోధంతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణవేణమ్మ
విరుచుకుపడింది తన ప్రవాహానికి అడ్డుకట్టిన ఊళ్లమీద

నిన్నటివరకూ నిప్పులు చెరిగిన భానుడు
చెలరేగిపోయాడు తనని కూడా లెక్క చెయ్యని జనం మీద

ఈరోజు ఆగ్రహంతో ఊగిపోతున్న సముద్రుడు
విరుచుకుపడబోతున్నాడు మరోసారి సామాన్య ప్రజల మీద

ఓ కృష్ణమ్మా ! ఓ భానుడా ! ఓ సాగరుడా !
మీకు కూడా డొక్కలెండిన సామాన్యుడే లోకువా ?
మీ ప్రవాహంతో అవినీతిని కడగలేరా ?
మీ ప్రతాపంతో అన్యాయాన్ని భస్మం చెయ్యలేరా ?
మీ అలల వేగంతో కుత్సితం నిండిన వ్యవస్థను ముంచెత్తలేరా ?




Vol. No. 01 Pub. No. 291

Thursday, April 8, 2010

బహుపరాక్ !!!


నాకు మెయిల్ లో ఒక ఇంటర్నెట్ మిత్రుడు పంపిన సమాచారం ఆధారంగా,,,,,,,,,,,,,,,,


బెంగుళూరులో పది సంవత్సరాల బాలుడు పదిహేను రోజుల క్రితం ఒక అనాసపండు ( పైనాపిల్ ) తిన్నాడు. ఆరోజునుంచి అతను జబ్బు పడ్డాడు. అతన్ని ఆరోగ్య పరీక్షలకోసం తీసుకెళ్ళారు.........

ఆ పరీక్షల్లో అతనికి ఎయిడ్స్ వుందని నిర్థారణ అయింది.

ఆ బాలుని తల్లిదండ్రులు ఈ విషయం నమ్మలేకపోయారు..... మొత్తం కుటుంబం ఆరోగ్య పరీక్షలు చేయించుకుంది.....ఎవరికీ ఎయిడ్స్ లేదని తేలింది. అప్పుడు డాక్టర్లు అతన్ని జబ్బు పడటానికి ముందు తిన్న పదార్థాల గురించి ప్రశ్నించారు. అతను ఆ రోజు తిన్న అనాసపండు విషయం బయిట పడింది. అంతే !! ఆస్పత్రినుంచి ఓ బృందం ఆ అనాసపండు అమ్మినతని దగ్గరకు వెళ్ళింది.

ఆరోజు జరిగిన విషయం గురించి విచారించారు. వారికో ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఆ అనాసపండు కోస్తుండగా ఆ పండ్లు అమ్మే అతని చేతి వేలు తెగి రక్తం కారి ఆ పండు ముక్కలకు అంటినట్లు తెలిసింది.

దాంతో అతనికి రక్త పరీక్ష చెయ్యగా అతనికి ఎయిడ్స్ వుందని తెలిసింది. దురదృష్టవశాత్తూ అతనికా విషయం తెలియక పోవడంతో తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. దాంతో ఆ మహమ్మారి అతని రక్తం ద్వారా ఆ బాలునికి అంటింది. చెయ్యని పాపానికి ముక్కుపచ్చలారని ఆ బాలుడు బలయ్యాడు.

అందుకే రోడ్ పక్కన అమ్మే చాట్ మసాలాలు, పానీ పూరీలు వగైరా తినే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి. మీ ప్రమేయం లేకుండా ఇలాంటి రోగాల బారిన పడకండి.

ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువమందికి ముఖ్యంగా మీ పిల్లలకు చేరేటట్లు చూడండి.
బహుపరాక్ !!!

ఆ మెయిల్ లోని సమాచారం :

Dear All,

It's in INDIA - Karnataka - Bangalore

A 10 year old boy, had eaten pineapple about 15 days back, and fell

sick, from the day he had eaten. Later when he had his Health check

done......

doctors diagnosed that he had AIDS.


His parents couldn't believe it...Then the entire family under went a

checkup... none of them suffered from Aids. So the doctors checked again

with the boy if he had eaten out....The boy said 'yes'. He had pineapple

that evening. Immediately a group from the hospital went to the

pineapple vendor to check.


They found the pineapple seller had a cut on his finger while cutting

the pineapple; his blood had spread into the fruit.



When they had his blood checked...the guy was suffering from AIDS...but

he himself was NOT aware. Unfortunately the boy is suffering from it

now.


Please take care while u eat on the road side (
particularly tasty vada
pav & Paani Puri
) and pls fwd this mail to your dear one's..

PEOPLE
  TAKE CARE


PLEASE FORWARD THIS MAIL TO ALL THE PERSONS YOU KNOW AS YOUR MESSAGE MAY

SAVE ONE'S LIFE !!!!!


Vol. No. 01 Pub. No. 248

Saturday, March 20, 2010

నిదురపోరా తమ్ముడా !

ష్....! గప్ చుప్ .....

*
*
*
*
ఎక్కడనుంచి హాయి గొలిపే ఆ మధుర గానం ?......... మంచి నిద్ర వస్తోంది. ...... ఎవరు ఆ గాన కోకిల ?






మొన్న 19 వ తేదీ ప్రపంచ నిద్రా దినోత్సవం సందర్భంగా .............




Vol. No. 01 Pub. No. 231

Sunday, February 21, 2010

మాతృభాషాదినోత్సవం-విలువైన సమాచారం

ఈ రోజు అంటే ఫిబ్రవరి 21 వ తేదీ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవంగా ప్రకటించింది. ఆ సందర్భంగా మన మాతృభాష అయిన తెలుగుకి సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించారు శ్రీ నూర్ రెహమతుల్లా గారు. ఈయన తెలుగు భాషా వ్యాప్తికి, ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు వాడకానికి విశేషమైన కృషి చేస్తున్నారు. ప్రభుత్వాధికారిగా తనకున్న విస్తృతాధికారాల్ని తెలుగు భాషా వ్యాప్తికి ఉపయోగించడం ఎంతైనా అభినందనీయం. తెలుగుకు ప్రాభవానికి విశేషమైన కృషి చేస్తున్న ఆయనకు అభినందనలు తెలుపుతూ, తెలుగు భాషను ప్రేమించే వారందరికీ మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలతో రెహమతుల్లాగారు అందించిన ఈ వ్యాసం...................

విద్యార్ధులు తెలుగులో మాట్లాడకూడదట
* కడప జిల్లా మైదుకూరు సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో తెలుగుభాష మాట్లాడకూడదంటూ చిన్నారుల మెడలో బోర్డులు తగిలించారు.తెలుగు భాష మా ట్లాడకూడదంటూ విద్యార్థులపై ఆంక్షలు విధించడం మానవ హ క్కుల ఉల్లంఘనకు పాల్పడటమేనని, ఇది ఘోర తప్పిదమని మా నవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టి స్‌ సుభాషణ్‌రెడ్డి వ్యాఖ్యానించా రు. (ఆంధ్రజ్యోతి 28.10.2009)
పసిపిల్లలు ఏడ్చేది మాతృభాషలోనే
పుట్టకముందే నేర్చుకుంటారు.మాతృభాషలో ఎన్నడూ మాట్లడనంటూ రాసి ఉన్న బోర్డులను చిన్నారి విద్యార్థుల మెడలో 'ఉపాధ్యాయులు' వేలాడదీయటం అనైతికమే కాదు అసహజం కూడా అని సైన్స్‌ నిరూపించింది. అప్పుడే పుట్టిన పసిపిల్లలు ఏడ్చే ఏడుపు కూడా మాతృభాషలోనే ఉంటుందని జర్మనీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అమ్మ గర్భంలో ఉన్న తొమ్మిది నెలల్లో.. చివరి మూడు నెలల సమయంలో తల్లి మాటలు వింటూ పిల్లలు మాతృభాష గురించి తెలుసుకుంటారని, పుట్టిన తర్వాత వారి ఏడుపు అదే భాషను ప్రతిఫలిస్తుందని తెలిసింది.పిల్లలు గర్భంలో ఉండగానే తల్లి మాటలు వింటూ ఉచ్చరణ గురించి తెలుసుకున్నారని స్పష్టమైంది. పిల్లలు వివిధ రకాల ధ్వనుల్లో ఏడ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ.. మాతృభాషకే ప్రాధాన్యమిస్తున్నారని కూడా ఈ పరిశోధనలో తెలిసింది. అమ్మతో అనుబంధాన్ని పెంచుకోవటం కోసమే శిశువు తనకు తెలిసిన మొదటి విద్యను ఇలా ప్రదర్శిస్తుంటారు.(ఈనాడు7.11.2009).కాబట్టి అన్ని మతాల దైవప్రార్ధనలు కూడా మాతృభాషల్లో ఉండటం సమంజసమే.
ద్వితీయ భాషగా తెలుగుకు బదులు ఇంగ్లీష్
ఆరు, ఆపై తరగతులు చదివే విద్యార్థులు ద్వితీయ భాషగా తెలుగుకు బదులు ఇంగ్లీష్‌ తీసుకోవడానికి ఇక మీదట జిల్లా విద్యా శాఖాధికారులే (డీఈఓ) అనుమతి ఇవ్వొచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు ద్వితీయ భాషగా ఇంగ్లీష్‌ను తీసుకోవాలంటే పాఠశాల విద్య డైరెక్టరేట్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. (ఆంధ్రజ్యోతి1.11.2009)-
తెలుగుపై పరిశోధన.. అమెరికాలోనే ఎక్కువ
మనదేశంలో భాషలపై పరిశోధనలు జరిపే వారే కరవయ్యారని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్‌ సిబాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడితో పోలిస్తే.. అమెరికాలోనే ఎక్కువమంది తమిళ, తెలుగు భాషలపై పరిశోధనలు చేస్తున్న వారు కనిపించారని తెలిపారు.(ఈనాడు31.1.2010)
అంతరించిపోతున్నఅమ్మభాష
దాదాపు రెండుతరాల విద్యార్థులు తెలుగు రాకుండానే, తెలుగుభాషను తూతూమంత్రంగా చదువుకునే కళాశాలల నుంచి బైటికొచ్చారు. వాళ్లంతా ఇంజినీర్లు, డాక్టర్లు, ప్రభుత్వశాఖల్లో పెద్దపెద్ద ఉద్యోగులైపోయారు. తెలుగంటే వెగటు. ఇంట్లో తెలుగక్షరాలు కనపడనీయరు. వినబడనీయరు. ఇక వీరి పిల్లలకు మాత్రం తెలుగంటే ఏం తెలుస్తుంది పాపం! ఇలాగే ఇంకో రెండుతరాలు కొనసాగితే, తెలుగువాచకాన్ని సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ఓ పురాతన వస్తువులా ప్రదర్శనకు పెట్టాల్సిందే.పేరుకు భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రమైనా, మనదగ్గర తల్లిభాషది రెండో స్థానమే. మళ్లీ మాట్లాడితే, మూడోస్థానమే.యాభై ఏడక్షరాలు, మూడు ఉభయాక్షరాలున్న మన వర్ణమాల ప్రపంచ భాషల్లోనే రెండో అతి పెద్దది. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత కానీ మనం తెలుగుభాషకు అధికార హోదా కల్పించుకోలేకపోయాం. తెలుగుభాషకే మంగళహారతులు పాడేస్తున్నాం.ఇంగ్లిష్‌, రోమన్‌, జర్మన్‌ సహా సంస్కృతం, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం వంటి భాషలన్నింట్లోకీ ఒక్క తెలుగు భాషకే భావాలను వేగాతివేగంగా అక్షర రూపంలోకి తర్జుమా చేయగల శక్తి ఉందని నిరూపించారు. 'ఇంగ్లిషులో ఒక అక్షరం 4.71 బిట్ల సమాచారాన్ని అందించగలిగితే, తెలుగు అక్షరం అదే సమాచారాన్ని అందించడానికి 1.14 బిట్లు మాత్రమే ఉపయోగించుకుంటుందని తేలింది. హిందీకి 1.56 బిట్లు, తమిళానికి 1.26 బిట్లు, కన్నడానికీ మలయాళానికీ 1.21 బిట్లు అవసరమయ్యాయి. ఇంగ్లిషులో ఒకే పదానికి అనేక పర్యాయపదాలు ఉండగా, ఒక్కో ప్రత్యేక పదం ద్వారా ఒక్కో ప్రత్యేక భావాన్ని స్పష్టంగా అందించగల సామర్థ్యం తెలుగు భాషకుంది. అదే ఈ వేగానికి కారణం.కంప్యూటరు, మౌజు, కీబోర్డు, హార్డ్‌వేరు, సాఫ్ట్‌వేరు...చివర్లో అచ్చు గుద్దేస్తే చాలు, కాకలుతిరిగిన ఇంగ్లీషు పదమైనా పంచెకట్టులోకి మారిపోతుంది. సాంకేతిక పదజాలాన్ని ఇట్టే ఇముడ్చుకోగల శక్తియుక్తులున్న ఏకైక భాష... భారతీయ భాషలన్నింట్లోకీ ఒక్క తెలుగేనని యాభై ఏళ్ల కిందటే ప్రపంచ ప్రసిద్ధ రసాయనశాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హాల్డెన్‌ ప్రశంసించారు.మనదేశంలో 1652 మాతృభాషలున్నాయి. వీటిలో మహా అయితే ఓ పదిహేను, పదహారు భాషలకు లిపి ఉంది. రెండువందల భాషలకు పదహారు వందలకుపైగా మాండలికాలున్నాయి. ముప్ఫైశాతం పిల్లలు తమ మాతృభాషను నేర్చుకోవడం మానేస్తే, ఆ భాష ఉనికి ప్రమాదంలో పడినట్టే.1956 ఫిబ్రవరి 29న పాక్‌ సర్కారు బెంగాలీని కూడా మరో అధికార భాషగా గుర్తించింది. మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం'గా ప్రకటించింది. - కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు 21.2.2010)

Vol. No. 01 Pub. No. 204

Tuesday, January 26, 2010

గణతంత్ర దినోత్సవ కానుక


అమెరికా మనకు గణతంత్ర దినోత్సవ షష్టి పూర్తి సందర్భంగా ఒక ప్రత్యేకమైన కానుక అందించింది.
అదేమిటో ఇక్కడ చూడండి. స్పందించండి.


Vol. No. 01 Pub. No. 169

Friday, December 11, 2009

ఉద్యమకారులకి నాయకుడి సందేశం

ఉద్యమాల్లో సమిధలవుతున్న విద్యార్థులకు, అమాయకులైన ప్రజలకు ఈ నాయకుడు ఇస్తున్న సందేశాన్ని చూడండి.




Vol. No. 01 Pub. No. 134

Wednesday, December 9, 2009

చరిత్ర చెప్పిన ఉద్యమ సత్యాలు

1921 - ఇతర భాషల వారు తెలుగు భాషను చిన్న చూపు చూడటం సహించలేక తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి నిజాం పాలన క్రింద ఉన్న తెలంగాణా ప్రాంతంలో టేకుమళ్ళ రంగారావు, కె.వి.రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు మొదలైన వారు ' ఆంధ్ర జన సంఘం ' ఏర్పాటు చేశారు.
1937 - నిజామాబాద్ లో జరిగిన ఆంధ్ర సభలో బాధ్యతాయుతమైన పాలన కావాలని, బ్రిటిష్ ఇండియాలో వలె సంస్కరణలు అమలుచేయ్యాలని మొదటి రాజకీయ తీర్మానం చేశారు.
1938 - హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటయింది. నిజాం దానిని నిషేధించాడు.
1939_ 40 - సోషలిస్ట్ భావాలతో కమ్యూనిస్ట్ పార్టీ అవతరించింది.
1946 - హైదరాబాద్ సంస్థానంలో రాజకీయాలు మితవాద, అతివాద రాజకీయాలుగా విడిపోయాయి.
వీరిని అణచడానికి నిజాం అండదండలతో ' రజాకార్లు ' తయారయ్యారు.
1947 - భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా నిజాం నవాబు భారత యూనియన్ చేరకుండా యథాతథ ఒప్పందం కుదుర్చుకున్నాడు. తెలంగాణా ప్రజలపై రజాకార్ల ఆగడాలు పెరిగిపోయాయి.
1948 - భారత ప్రభుత్వ సైనిక చర్యతో తెలంగాణా ప్రజలకు నిజాం పీడ వదిలిపోయింది.
1952_56 - హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. విశాలాంధ్ర ఏర్పాటు ప్రయత్నాలు సాగుతున్నపుడు కొందరు తెలంగాణా విడిగానే ఉండాలని పట్టుబట్టగా బూర్గుల రామకృష్ణారావు వారికి మద్దతిచ్చారు. విశాలాంధ్ర ఖాయమని తేలిపోయాక అభిప్రాయం మార్చుకుని దానికి తన మద్దతును ప్రకటించి ద్వంద్వ నీతిని ప్రదర్శించారు.
1956 - రాష్ట్రాల పునర్విభజన సంఘం నివేదిక ఆధారంగా కుదిరిన పెద్దమనుష్యుల ఒప్పదం ఫలితంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలుగు వారందిరినీ ఏకం చేస్తూ మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు చేసింది.
1969 - ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఋజువు కావడంతో చెన్నారెడ్డిని ఆరు సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చెయ్యకూడాదంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో తెలంగాణా వారిని ఆంధ్ర వాళ్లు అణగదొక్కుతూన్నారంటూ ఉద్యమం ప్రారంభమయింది. వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వేలమంది జీవితాలు బలయ్యాయి. కానీ ఆ ఉద్యమం చెన్నారెడ్డి రాజకీయానికి బలైపోయింది.
1972 - తెలంగాణా ఉద్యమ ఫలితంగా అధిష్టానం బ్రహ్మానందరెడ్డి చేత రాజీనామా చేయించి తెలంగాణా ప్రాంతానికి చెందిన పి. వి. నరసింహారావును ముఖ్యమంత్రిగా చేసింది. ఈ చర్యకు ఫలితంగా భూసంస్కరణలు అమలు, ముల్కీ నిబంధనలపై సుప్రీం కోర్ట్ స్టే కారణాలుగా చూపుతూ ప్రత్యేకాంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. చివరికి అది కూడా రాజకీయ ప్రయోజనాలకి బలయిపోయింది.

ఏ ఉద్యమ చరిత్ర చూసినా
ఏమున్నది గర్వకారణం
అమాయకుల బలిదానం
నాయకుల స్వలాభం
ఇది చరిత్ర చెప్పిన సత్యం

సమ్మె ఘెరావు దొమ్మీ
బస్సుల దహనం లూటీ
శాంతీ సహనం సమ ధర్మంపై
విరిగెను గూండా లాటీ
గాంధీ పుట్టిన దేశమా ఇది
నెహ్రు కోరిన సంఘమా ఇది
సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా !
.......... ( పాటను చూడండి ! )




Vol. No. 01 Pub. No. 132

Monday, November 30, 2009

చరిత్ర పునరావృతం

1969
తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర నినాదంతో హోరెత్తింది
భవిష్యత్తు పై కలలుకన్న విద్యార్థులెందరో బలయ్యారు
వారి ఆవేశమే స్వార్థరాజకీయ నాయకుల పెట్టుబడి
ఉద్యమం ఆ నాయకుల చేతిలోనే బలయ్యింది
1973
ప్రత్యేక ఆంధ్రోద్యమం ఉవ్వెత్తున ఎగిసింది
ఇందులో కూడా విద్యార్థులే బలయ్యారు
అర్థ సంవత్సరం పైన నడిచింది
ఈ ఉద్యమం కూడా షరా మామూలే !
2009
ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఉధృత రూపం దాల్చింది
విద్యార్థులూ.....!! బహు పరాక్ !!!
మరోసారి నాయకుల రాజకీయ లబ్దికి బలవకండి
చరిత్ర ఇప్పటికే పునరావృత్తమయింది

Vol. No. 01 Pub. No. 122

Friday, November 20, 2009

ఆంధ్రప్రదేశ్ లో మొదటి మహిళా సౌరశక్తి ఇంజనీర్లు

" కృషి ఉంటే మనుష్యులు ఋషులవుతారు " కొంచెం ప్రేరణ, ప్రోత్సాహం ఉంటే ఏపని నేర్చుకోవడానికైనా విద్య, ఆర్ధిక పరిస్థితి, లింగ బేధాలు వగైరా అడ్డంకి కాదు. పట్టుదల, కృషి ఉంటే చాలని నిరూపిస్తూ మహిళా సాధికారతకు దర్పణమైన ఈ వీడియో చూడండి.


Vol. No. 01 Pub. No. 115

Thursday, October 8, 2009

ప్రజలు గొర్రెల మందలా ?

ఉద్యమాలన్నీ సాధారణంగా ఉన్నతమైన ధ్యేయాలతోనే ప్రారంభిస్తారు. భాదిత వర్గంనుంచే ఉద్యమాలు పుడతాయి. కాకపోతే క్రమేణా అందులో రాజకీయనాయకులు ప్రవేశిస్తారు. తమ రాజకీయ లబ్ధికి అనుకూలంగా వాటిని మలుచుకుంటారు. దాంతో ఉద్యమ ధ్యేయం ప్రక్కకేళ్ళిపోతుంది. ప్రారంభించినవారు అయోమయంలో పడిపోతారు. నెమ్మదిగా ఉద్యమం నీరసించిపోతుంది. మరుగునపడిపోయామనుకున్న రాజకీయ నాయకులకి మళ్ళీ జీవం ఇస్తుంది. ఉద్యమ పునాదులపైన కొంతమంది కొత్త రాజకీయనాయకులు పుట్టుకొస్తారు . ఉమ్మడి మదరాసు రాష్ట్రం నుండి ప్రత్యేక ఆంద్ర రాష్ట్రసాధన కోసం నిరాహారదీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములుకి ఇప్పటి రాజకీయనాయకులకున్న తెలివితేటలు లేవనుకుంటా ! ఉంటే 58 రోజులు నిరాహారదీక్ష చేసేవాడుకాదు. వారం రోజులో చేసి పెద్దల్ని రప్పించుకుని తన రాజకీయ ప్రయోజనాలపైన స్పష్టమైన హామీలను పొంది నిమ్మరసం తాగేసేవారు. ఉద్యమ ఉద్దేశాలను గంగలో కలిపేసేవారు.అప్పుడు ఆంద్ర రాష్ట్రం ఇవ్వాల్సిన అవసరం ఉండేదికాదు. గుంటూరులో అమృతరావు అనే వ్యక్తి గురించి చాలా మందికి తెలియక పోవచ్చు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం జరిగిన ఉద్యమంలో నిరాహారదీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి. పెద్ద ఉక్కు కర్మాగారం వచ్చినా ఆతన్ని మాత్రం మరిచిపోయాం. దానికి కారణం బహుశా అతను రాజకీయనాయకుడు కాకపోవడమేనేమో! ప్రజలలోంచి పుట్టిన ఉద్యమాల పరిస్థితే ఇలాఉంటే ఇక రాజకీయనాయకులు ప్రారంభించిన ఉద్యమాలేలా ఉంటాయో ప్రస్తుత తెలంగాణా ఉద్యమాన్ని చూసి తెలుసుకోవచ్చు. దాన్ని కే.సి.ఆర్. ఎన్ని మలుపులు తిప్పాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరో మలుపు. ఉద్యమాల మీద, ముఖ్యంగా రాజకీయ నాయకుల నాయకత్వం మీద ప్రజలకు విశాసం పోయిందనేది మొన్నటి ఎన్నికలు నిరూపించాయి. నిజానికి తమకు కావలిసింది మౌలిక సదుపాయాలేగానీ రాష్ట్రంలో ఉన్నామనేది కాదని నిరూపించారు. ఎంతగా ప్రాంతీయ బేధాలను రెచ్చగొట్టినా పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్త పల్లవి వినిపిస్తోంది. అదే కులబేదాలు. మహాత్మా గాందీ కులమేమిటో ప్రజలేవరూ పట్టించుకోలేదు. ఆయనా పట్టించుకున్న దాఖలాలు చరిత్రలో ఎక్కడా కనబడవు. ఇంతకాలం తర్వాత రోశయ్యగారి పుణ్యమాని కే.సి.ఆర్. ప్రజలకు గుర్తుచేస్తున్నారు. ప్రజలు తమ శక్తి ఏమిటో అంత స్పష్టంగా చెప్పినా ఇంకా అర్థం కాకపోవడం అతని అజ్ఞానమా? కాదు. ప్రజల జ్ఞాపకశక్తి మీద అతనికున్న అపార నమ్మకం, త్వరలోనే అన్నీ మర్చిపోతారని. ప్రజలు గొర్రెల మందని అతని నిశ్చితాభిప్రాయం. దాదాపుగా రాజకీయనాయకులందరి అభిప్రాయం కూడా అదేననుకోండి. ప్రాంతీయ బేధం అంతగా పని చెయ్యలేదు. ఇప్పుడీ కులాల్ని అడ్డుపెట్టుకుని కొంతమందినైనా కదిపితే మళ్ళీ అందరూ నెమ్మదిగా తన వెనుక వచ్చేస్తారనే భావన కే.సి.ఆర్. కి ఉందనుకుంటా !
ఎన్నికల్లో పోటీ చేయడానికి దేశంలోని ప్రతి పౌరుడూ రాజ్యాంగం ప్రకారం అర్హుడే ! కానీ రాజకీయాలు ప్రస్తుతం డబ్బూ, పలుకుబడి, కులం, దాదాగిరి అనే వాటి చుట్టూ తిరుగుతున్నాయి. అవే నిజమైన ప్రజాసేవకుల్ని రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నాయి. అవకాశాన్ని వ్యవస్థ కల్పించదు. కనుక దీనికున్న ఒకే ఒక పరిష్కారం ప్రస్తుతమున్న రాజకీయ పార్టీలను పట్టించుకోకుండా ప్రజాసేవ చెయ్యాలనే తలంపు ఉన్న ప్రతి ఒక్కరూ స్వతంత్రులుగా ఎన్నికలలో పోటీ చేసి గెలిచి తర్వాత కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడమే ! లేకపోతే మళ్ళీ మళ్ళీ వీళ్ళే పోటీ చేస్తుంటారు. వీళ్ళలోనే ఎవరో ఒకరిని ఎన్నుకోక తప్పనిపరిస్థితి. కానీ అలా పోటీ చెయ్యడం, సమైక్యంగా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడం సాధ్యమా ? ఎన్ని సాధ్యం కాలేదు ? ఇది కూడా సాధ్యమౌతుందని ఆశిద్దాం !! మనిషి ఆశాజీవి దా ! క్షమించాలి. నా రాజకీయ పరిజ్ఞానం పరిమితం. అయినా నేను కూడా ఆశాజీవినే !

Sunday, October 4, 2009

జల ప్రళయ సుందర దృశ్యం

కృష్ణవేణి కరాళ నృత్యం చేస్తోంది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు చవిచూసిన కర్నూలు ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. గడగడలాడించిన శ్రీశైలం కొంత ఉపశమనాన్ని కలిగిస్తోంది. నాగార్జున సాగర్ దగ్గర ఉధృతి ఇంకా తగ్గలేదు. కృష్ణా, గుంటూరు జిల్లాల్ని ప్రకాశం బారేజి వణికిస్తోంది. అయిదు జిల్లాల ప్రజలు కృష్ణమ్మ ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు. ఎప్పుడూ ప్రశాంతంగా, గంభీరంగా ప్రవహించే కృష్ణలో దాగునిఉన్న ఉగ్రరూపాన్ని ప్రాంత ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు. దాని ఫలితాల్నివిషాదభరిత పరిస్థితుల్లో అనుభవిస్తున్నారు. రాష్ట్ర విద్యుత్తు అవసరాలలో సింహ భాగం తీరుస్తున్న విజయవాడ థెర్మల్ పవర్ స్టేషన్ నీట మునిగే ప్రమాదంలో ఉంది. ఇదే జరిగితే రాష్ట్రంలో చాలా భాగం అంధకారంలో మునిగిపోతుంది. తెల్లవారేలోగా ఏం జరుగుతుందో ఉహించలేని పరిస్థితి.
ప్రస్తుతం కృష్ణమ్మ పరవళ్ళలో విలయమే కనిపిస్తోంది. భయానక, భీభత్సాలే కానీ ఇందులో అందమైన, సుందరమైన దృశ్యం ఎలా కనబడుతుంది ?
కానీ ఒక తెలుగు టీవీ ఛానల్ కి నాగార్జున సాగర్ లో ఉప్పొంగుతున్న కృష్ణ లో సుందర దృశ్యమే కనబడుతోంది. కృష్ణ విలయ తాండవాన్ని చూడడానికి వచ్చిన సందర్శకులతో నాగార్జున సాగర్ కిక్కిరిసిపోయింది. అక్కడ రహదారుల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఇది సహజంగానే అక్కడ డ్యాము రక్షణ విధుల్లో తలమునకలైన సిబ్బందికి ఆటంకం కలిగిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో వారి విధులకు ఆటంకం కలిగిస్తే జరిగే నష్టం గురించి మీడియాలో ఉన్నవారు ఉహించలేరా ? విషాదకర దృశ్యాన్ని సుందర దృశ్యంగా వర్ణించడం ప్రజల్ని ప్రభావితం చేయగలిగే శక్తి ఉన్న మీడియా వారికి సబబేనా ? వర్ణన వల్ల మరింతమందికి ఆసక్తి కలిగి సందర్శన కోసం బయిల్దేరి తాము ప్రమాదంలో చిక్కుకోవడమే కాక పరోక్షంగా భయంకరమైన విపత్తుకి కారణం కారా ? ఛానల్ వారు తమ పాండిత్య ప్రదర్శనలో చూపిస్తున్న ఉత్సాహం, బాధితులకు సహాయం అందించే దిశగా ప్రజల్ని ప్రేరేపించేదిగా ఉండాలిగానీ మరింతమంది బాధితుల్ని పెంచేదిగా మాత్రం ఉండకూడదు. నిజానికి విపత్కర పరిస్థితిలో మీడియా పోషిస్తున్న పాత్ర అభినందనీయంగానే ఉంది. అందులో సందేహం లేదు. అయితే అత్యుత్సాహం పనికిరాదు. ప్రజల్ని సరైన దిశకు మరల్చే ప్రయత్నం చెయ్యాలి. ఇలాంటివి చాలా చిన్న విషయాలుగా కనబడినా ప్రజల్లో మీడియా కలిగించే ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అందుకే మీడియా సంయమనం పాటించాలి. తప్పదు. సమాజం పట్ల తమ బాధ్య గుర్తించి తమ ప్రతి రిపోర్ట్ ను జాగ్రత్తగా ఆలోచించి ఇవ్వవలసి వుంటుంది.

Saturday, October 3, 2009

కన్నీటి వరద

కృష్ణమ్మకు ఆగ్రహమొచ్చింది. కట్టలు తెంచుకుంది. బీభత్సం సృష్టిస్తోంది. ఇంకా ఎంతకాలం ఈ ప్రళయం కొనసాగుతుందో, ఎంత నష్టం సంభవిస్తుందో అర్థం కాని పరిస్థితి. మొన్నటిదాకా వరుణుడి రాకకోసం ఎదురు చూసాం. ఇప్పుడు మాత్రం పోకకోసం ప్రార్థించవలసిన పరిస్థితి. రెండు జిల్లాల ప్రజల్ని కన్నీటితో ముంచెత్తిన కృష్ణమ్మ ఇంకా కరుణించేటట్లు లేదు. ప్రకృతి కోపమొస్తే ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా చూపిస్తోంది. ఈ పరిస్థితికి కారణాలు ఏమిటనేది అలవాటు ప్రకారం పోస్ట్ మార్టం చేసుకుంటే అన్ని విషయాలు ప్రక్కన పెట్టి చేసిన, చేస్తున్న మానవ తప్పిదాలకు మూల్యం చెల్లిస్తున్నాం అనేది స్పష్టం. అది ప్రభుత్వ వైఫల్యం అని ప్రతిపక్షాలు, అధికారుల వైఫల్యమని ప్రజలు అనుకుంటూ ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కూర్చోవడం కంటే ఈ వాస్తవాలు గ్రహించడం మంచిది. ఈ దుస్థితికి కారణం అడవులు విచ్చలవిడిగా నరకడం, కాలుష్యాల్ని పెంచేసుకోవడం , ప్లాస్టిక్ లాంటి పదార్ధాల వాడకం పెరగడం.... ఇత్యాదివెన్నో !! కర్ణుడి చావుకి కారణాలెన్నో !!! విపత్తు జరిగినపుడు హడావిడి పడడం కంటే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకుని, జాగ్రత్త వహించడమే మన తక్షణ కర్తవ్యమ్ !!!

Friday, September 25, 2009

అందిన జాబిలి

చందమామ రావే !
జాబిల్లి రావే !!

అని చిన్నప్పుడు పాడుకున్నాం. మరి ఇప్పటి పిల్లలు పాడుకుంటూ ఉన్నారో , లేదో తెలీదు. కానీ మన శాస్త్రవేత్తలు మాత్రం మనకు చందమామని అందించేసే ప్రయత్నాల్లో ముందడుగు వేసారు. కంగా చందమామ మీద మనకు కాలనీలు కట్టించేస్తారుట ! ఇప్పటివరకూ చందమామ మనకు చుట్టమనేది కవుల కల్పనలోనే అనుకుంటున్నాం !! కల్పన కాదని నిజంగానే చందమామ మనకు దగ్గర చుట్టమని తేల్చేసారు మన శాస్త్రవేత్తలు . అగ్ర దేశాలు గత నలభై, యాభై సంవత్సరాలుగా అనేక ప్రయోగాలుచేసినా నిర్థారించలేకపోయిన విషయాన్ని మన ప్రయోగం సాధించడం గర్వకారణమే !!! శాస్త్ర పరిజ్ఞానం ఇంత అభివృద్ది చెంది, స్వయంగా గ్రహాలను, గతులనూ పరిశీలించే అవకాశాలున్న రోజుల్లో మాత్రం సాధించినందుకే పొంగిపోతున్నాం ! ' మాత్రం' అని ఎందుకన్నానంటే సదుపాయాలు లేని రోజుల్లోనే గ్రహగతుల్ని ఖచ్చితంగా అంచనా వెయ్యడంలో, వాటిని ఆధారం చేసుకుని భవిష్యత్తు దర్శనం చెయ్యడంలో మన దేశం ప్రాచీనకాలంలోనే ముందంజలో ఉంది. విషయం ఎవ్వరూ కాదనలేని సత్యం. 'అన్నీ వేదాల్లో ఉన్నాయష ' అనే డైలాగుని వెటకారం చేసే వాళ్ళను మనమేం చెయ్యగలం... అంతరిక్ష పరిశోధనలో ప్రపంచానికే దారి చూపించిన ప్రస్తుత మన శాస్త్రవేత్తల పరిజ్ఞానాన్ని చూపించడం తప్ప. తల్లిదండ్రులందరూ ఇప్పటికైనా మన ప్రాచీన విజ్ఞాన చరిత్ర మీద తమ పిల్లలకి అవగాహన కలిగేటట్లు చేస్తే మన దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనటంలో సందేహం లేదు.