1980 దశకం వరకూ సామాన్యుడికి అందుబాటులో వున్న ఏకైక ప్రధాన ప్రసార మాధ్యమం ' రేడియో ' అదే 'ఆకాశవాణి '. మన దేశంలో స్వాతంత్ర్యానికి పూర్వమే ప్రాచుర్యంలోకి వచ్చిన రేడియో తర్వాత సామాన్య జనం జీవితాలలో విడదీయరాని భాగమైపోయింది. అప్పట్లో నాటకాలంటే దసరా, వినాయక చవితి మొదలైన ఉత్సవాల సమయంలోనో, అరుదుగా ఇతర సమయాలలోను ప్రదర్శించేవే ! రేడియో ప్రాచుర్యంలోకి వచ్చాక శ్రవ్య నాటక యుగం ప్రారంభమైంది. ప్రసిద్ధ నటుల రంగస్థల నాటకాలు గ్రామఫోన్ రికార్డులుగా వచ్చినా అప్పట్లో గ్రామఫోను కూడా లగ్జరీనే కావడం వలన అవి శ్రవ్య రూపంలో కన్న దృశ్య రూపంలోనే ఎక్కువ ఆదరణ పొందాయి. రేడియో శ్రవ్య నాటకాలను ప్రోత్సహించింది. ఎన్నో మంచి నాటకాలు వచ్చాయి. మరెన్నో మంచి నాటకాలు, కథలు, నవలలు శ్రవ్య నాటికలు, నాటకాలుగా రూపాంతరం చెందాయి. ప్రత్యేకంగా శ్రవ్య నాటకాలను రచించే రచయితలతో బాటు కొందరు ప్రసిద్ధ కవులు, రచయితలు అనేక రూపాల్లో శ్రవ్య నాటక రచన సాగించారు.
Vol. No. 01 Pub. No. 154


