Thursday, September 3, 2009
స్మశాన వైరాగ్యం
వై. యస్. రాజశేఖర రెడ్డి - నిన్నటి ఉదయం హెలికాప్టర్ ఎక్కేవరకూ ఒక వి.ఐ.పి. . ప్రముఖ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రాజకీయ చతురుడు. ఇడుపుల పాయ ఎస్టేట్, అనేక పరిశ్రమలు, వార్తాపత్రిక, వార్తా చానల్... ఇంకా... ఎన్నెన్నో కోట్లకు యజమాని. నిన్న ఆయనతో ప్రయాణం చేసిన సుబ్రహ్మణ్యం, వెస్లీ, పైలట్లు పోలికలో ఆయనకంటే సామాన్యులే. హెలికాప్టర్ ఎక్కేటప్పుడున్న తేడాలు చావులో ఎందుకు కనబడలేదు. మృతదేహాలన్నీ ఒకే రకంగా ఎందుకు మారిపోయాయి. హోదాగానీ , కోట్లు గానీ ఆయన్ని ఎందుకు రక్షించలేకపోయాయి ? సుమారు 25 గంటలపాటు ప్రభుత్వ యంత్రాగం, ఆయనకోసం వెదికిన వందలాదిమంది ప్రజలు ఆయన్ని సజీవుడుగా ఎందుకు తీసుకురాలేక పోయారు ? ఆంధ్రదేశమంతా ప్రజలు చేసిన పూజ పునస్కారాలు ఫలించలేదేందుకు ? గ్రహగతులును లెక్కగట్టి ఆయన సురక్షితంగానే ఉన్నాడని సజీవంగా తిరిగివస్తాడని చెప్పిన జ్యోతిష్యుల మాటలు నీటి మూటలెందుకయ్యాయి ? ఇంకా ... ఎన్నో ప్రశ్నలు. వీటన్నిటికీ ఒకటే సమాధానం. చావులోని విచిత్రం, గొప్పదనం అదే ! దీనికి కుల, మత , ప్రాంత, వర్ణ, స్థాయి లాంటి బేధాలేవీ దానికి లేవు. అవన్నీ నేను, నాదీ, నేనే గొప్ప అనే అహంకారాన్ని నరనరాల నింపుకున్న మనకే ! బతుకంతా ఇలా అహంకరిస్తూ, తోటి మనుష్యులను ఈసడించుకుంటూ ఉండే కంటే పదిమందికీ మంచిచేస్తూ, అది మన బాధ్యతని ఫీలయితే చనిపోయే ముందైనా సంపాదించిన ఆస్తినీ, అదిచ్చిన అహంకారాన్నీ కాకుండా, కాస్త సంతృప్తిని మూట కట్టుకోవచ్చేమో ! ................. ఇదే శ్మశాన వైరాగ్యమంటే !!
Labels:
మనసులో మాట
Subscribe to:
Post Comments (Atom)
చాలా చక్కగా చెప్పారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో పుట్టిన వైరాగ్యం జీవితాంతం ఇలాగే ఉంటే బాగుణ్ణు.
ReplyDeleteYOU CANNOT HAVE RESERVATIONS IN DEATH..
ReplyDeleteInteresting viewpoint
ReplyDelete